‘రాజాసాబ్’ నుంచి ఒక్క పాట కూడా బయటకు రాలేదు. కానీ… ఆడియో రైట్స్ మాత్రం అమ్ముడైపోయాయి. ఈ సినిమా ఆడియో హక్కుల్ని టి.సిరీస్ రూ.20 కోట్లకు కొనుగోలు చేసింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ సినిమా. పైగా పాటల పరంగా మారుతి టేస్ట్ బాగుంటుంది. అందుకే… ఆడియో ముందస్తుగానే అమ్మేశారు. ఇక ఓటీటీ రైట్స్ బాకీ పడింది. టీజర్ బయటకు వచ్చింది కాబట్టి, దానికి మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఓటీటీ కూడా హాట్ కేకులా అమ్ముడైపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సినిమా కోసం పాపులర్ బాలీవుడ్ పాటని రీమిక్స్ చేద్దామనుకొన్నారు. పాట కూడా దాదాపుగా రెడీ అయ్యింది. కానీ ఆ ఆడియో రైట్స్ కోసం దాదాపు రూ.5 కోట్లు అడిగార్ట. దానికి నిర్మాత అంగీకరించలేదు. ఆ స్థానంలో అలాంటి జోష్ ఉన్న మరో పాటని తమన్ రెడీ చేస్తురన్నాడని తెలుస్తోంది. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ ఆడి పాడే పాట ఇది. మంచి మాస్ సెట్యువేషన్. ఇలాంటి పాటలకు ఎలాంటి ట్యూన్ ఇవ్వాలో తమన్కి బాగా తెలుసు. సో.. వేరే కంపెనీకి రూ.5 కోట్లు ఇచ్చే బదులు.. ఆ పాటేదో తమన్ తోనే ట్యూన్ చేయించొచ్చని టీమ్ భావించింది. డిసెంబరు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.