వైసీపీలో ఉన్న కమ్మవాళ్లను వేధిస్తున్నారని జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయనకు కనీసం క్యారెక్టర్ కూడా లేదని ఆయన చుట్టూ ఉండేవారికి.. ఆయన ఓటర్లకు ఓ క్లారిటీ వచ్చేసింది. కమ్మ అంటే ద్వేషంతో ఐదు సంవత్సరాల పాటు పాలన చేసి.. మొత్తం ఆ వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తానని రంకెలు వేసి నిర్ణయాలు తీసుకున్న ఆయన .. చివరికి ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు తమ పార్టీలోని కమ్మవారిని వేధిస్తున్నారని దొంగ ఏడుపులతో బయలుదేరారు. అసలు ఆ కులాన్ని వేధించింది ఎవరు ?. తమ పార్టీ లోని ఆ కులం నేతలతో ఘోరమైన రాజకీయాలు చేయించి.. ఇప్పుడు వారిని రిస్క్ లో పెట్టింది ఎవరు ?. ఎప్పుడు వేధిస్తున్నారని మాట్లాడుతోంది ఎవరు ?
ఐదేళ్ల పాటు ఒక కులంపై ద్వేషంతో పాలన
జగన్ రెడ్డికి అధికారం దక్కినప్పటి నుండి ఒకే ఒక్క కులంపై ద్వేషంతో పాలన చేశారు. ఆ విషయం బహిరంగం. తీసుకునే నిర్ణయాలు.. మాట్లాడే మాటలు అన్నీ కులం చుట్టూనే తిరిగేవి. చివరికి కరోనా వైరస్ కు కమ్మరోనా అని పేరు పెట్టారు. వ్యాక్సిన్ కు కులం పూత పూశారు. కులగజ్జీతో చేసిన పాలనకు ప్రజలకు బుద్ది చెప్పారు. ఆయనకు అర్థం కాని విషయం ఏమిటంటే.. ఒక్క కులాన్ని దెబ్బకొట్టడానికి చేసిన పాలనతో ఆ కులం దెబ్బతిన్నదో లేదో తెలియదు కానీ ప్రజలంతా దెబ్బతిన్నారు. అందరూ కలిసి ఎన్నికల్లో కొడితే పాతాళానికి పోయారు.
కమ్మ నాయకులకు ఈ దుస్థితి రావడానికి ఎవరు కారణం ?
జగన్ రెడ్డి చెప్పిన కమ్మ నాయకులకు ఆ పరిస్థితి రావడానికి జగనే కారణం. దిక్కూమొక్కూ లేని వంశీ అనే వ్యక్తికి రాజకీయ జీవితాన్ని చంద్రబాబు ఇచ్చారు. ఆయనను నకిలీపట్టాల కేసు పేరుతో బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. మరోసారి టీడీపీలోకి వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడించారు. అధికారం పోతే పరిస్థితి ఏమిటి అని ఆలోచించకుండా చేశారు. చివరికి ఇప్పుడు ఆయన బతుకు కుక్కలు చింపిన విస్తరి అయింది. జగన్ రెడ్డి చెప్పిన కమ్మ నాయకులంతా జగన్ రెడ్డి చెప్పినట్లుగా చేసి తమ బతుకుల్ని అలా చేసుకున్నారు. కొడాలి నాని అయినా ..మరొకరు అయినా.. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. కమ్మ అనే కారణంతో ఎవరూ తప్పించుకోలేరు. వారు పడే బాధలకు వందశాతం జగన్ రెడ్డినే కారణం.
కనీస కమ్మద్వేష క్యారెక్టర్ను అయినా కాపాడుకోవచ్చుగా !
జగన్ రెడ్డికి రాజకీయం చేతకాదు. రాజకీయాల్లో ఓ క్యారెక్టర్ ముఖ్యం. ముఖ్యంగా చేసే రాజకీయాల్లో. జగన్ రెడ్డి బలం కేవలం కుల వ్యతిరేకత.. చంద్రబాబు వ్యతిరేకత. ఆయనను వ్యతిరేకించేవారు జగన్ రెడ్డికి ఓట్లేస్తారు కానీ.. సొంతంగా ఎవరూ వేయరు. తన రాజకీయ బలమేంటో తెలుసుకోకుండా.. తన ద్వేషాన్ని దాచుకుని దొంగ నాటకాలు ఆడుతూ తెర ముందుకు వస్తున్నారు. తల్లి, చెల్లినే పట్టించుకోని జగన్ రెడ్డి ఇతర నేతలపై అభిమానాలు చూపిస్తారని ఎవరూ నమ్మరు. ప్రజలు.. కులాలు అసలు నమ్మవు. ఎవరైనా నమ్మేవాళ్లుంటే .. ఇప్పటికే క్లారిటీ వచ్చేసి ఉంటుంది.