జగన్మోహన్ రెడ్డి రప్పా రప్పా డైలాగ్ ను ప్రెస్మీట్ లో చెప్పి.. సాయంత్రం బెంగళూరు వెళ్లిపోయారు. ఆయన ఏపీకి వచ్చి మూడు రోజుల్లో కావాల్సినంత అలజడి రేపి.. క్యాడర్, లీడర్లను కేసుల్లో ఇరికించి. .. ఒకటి, రెండు ప్రాణాలు పోవడానికి కారణమయిన తన దారిన తానుపోతున్నారు. కానీ అసలు బాధలంతా క్యాడర్ అనుభవిస్తున్నారు.
రాప్తాడు, పొదిలి, తెనాలి, సత్తెనపల్లి ఇలా ఎక్కడికి వెళ్లినా అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చి పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగేలా చేశారు. ఈ క్రమంలో పలువురిపై కేసులు నమోదయ్యాయి. నరికేస్తామని బెదిరించేలా పలువురికి ఫ్లెక్సీలు ఇచ్చి నిలబెట్టి వైరల్ చేశారు. వారందరిపై కేసులు నమోదయ్యాయి. చాలా మంది అరెస్టు అవుతున్నారు. నిజానికి వారు అలా పోస్టర్లు వేయించలేదు.. వారి పై ఉన్న నాయకుల కుట్రలకు వారు బలయ్యారు. అలా పట్టుకుని నిలబడాలని వారే చెప్పారు. ఇప్పుడు ఆ కుటుంబాలను ఎవరు పట్టించుకుంటారు?
సత్తెనపల్లికి వెళ్లే టూర్ లో ఇద్దరు చనిపోయారు. వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. పట్టించుకున్న వారు లేరు. కనీసం వంద మందికిపైగా లీడర్లపై కేసులు ఇటీవలి కాలంలో జగన్ పర్యటనల వల్ల నమోదయ్యాయి. వారి పరిస్థితి దుర్భరంగా మారనుంది. కానీ జగన్ రెడ్డికి మాత్రం తన రాజకీయ ప్రయోజనాలు నెరవేరాయి కాబట్టి సైలెంటుగా వీకెండ్స్ లోబెంగళూరులో ఖుషీ అవుతున్నారు. మరి క్యాడర్ పరిస్థితి ఏమిటి?. అసలేం జరుగుతుందో వైసీపీ క్యాడర్ కు అర్థమవుతుందా?