మీడియా అంటే.. ప్రజల కోసం పని చేయాలి. బలం లేని వాడికి.. బలహీనుడికి వాయిస్ గా ఉండాలి. కానీ తెలుగు మీడియాలో నెంబర్ వన్, టు చానళ్లు అని టీఆర్పీలతో బద్దలు కొట్టుకునే రెండు చానళ్లు అత్యంత హీన స్థితిలో ఉన్నాయి. బలమైన వాడికి వాయిస్ గా మారుతున్నాయి.
జగన్ రెడ్డి ఏపీలో అనుమతి లేకుండా చేసిన సత్తెనపల్లి ర్యాలీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు జగన్ రెడ్డి కారు కిందనే పడి ప్రాణాలు కోల్పోయారు. ఆ వ్యక్తిని ఆస్పత్రికి కూడా తీసుకెళ్లకుండా.. క్రూరమృగాల్లాగా వ్యవహరించారు. చివరికి చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటే.. ఈ రెండు చానళ్లకు కనీసం చీమ కుట్టినట్లుగా లేదు. టీడీపీ, జనసేన లీడర్లు ఎక్కడైనా రికార్డింగ్ డాన్సులు ఆడించారంటే.. అంత కన్నా పెద్ద తప్పిదం లేదన్నట్లుగా ప్రచారం చేస్తారు. ఓ దళిత వృద్ధుడి ప్రాణాలకు విలువ లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
చివరికి ఈ వృద్ధుడి ప్రాణం తీయడాన్ని సమర్థించుకుంటున్నట్లుగా అంబటి రాంబాబు మాట్లాడితే .. దానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రసారం చేశారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారట. సింగయ్య అనే వైసీపీ కార్యకర్తను.. ఇలా కారుతో తొక్కించి చంపి.. రోడ్డు పక్కన పడేసిపోయే వ్యక్తిత్వాన్ని కళ్లారా చూసిన తర్వాత ఎవరైనా మరో రకంగా అనుకుంటారా?. జగన్ రెడ్డి తీరును ప్రశ్నించాల్సిన ఈ మీడియా చానల్స్.. ఏ మాత్రం మానత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి మీడియాకు ఇవాళ కాకపోతే రేపైనా పతనం తప్పదు. సామాన్యుల వైపు ఉండని మీడియా ఉంటే.. లేకపోతే ఎంత?