రిజిస్ట్రేషన్ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న మార్పులు చేస్తోంది. ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసిన ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (IGRS) ద్వారా ఒక గంటలోపు పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేసారు.
IGRS పోర్టల్ ద్వారా సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ముందస్తు స్లాట్ బుక్ చేసిన వారు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్లో 10-15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే, ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) , రిజిస్టర్డ్ డీడ్ వంటి పత్రాలు జారీ చేస్తారు. 2025 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ స్లాట్ బుకింగ్ సిస్టమ్ను ప్రారంభించారు.
రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ను రాష్ట్ర రెవెన్యూ డేటాబేస్తో అనుసంధానం చేశారు, దీనివల్ల డాక్యుమెంట్ వెరిఫికేషన్ , జారీ వేగవంతమయింది. ఆధార్ ఆధారిత ఈ-కెవైసీ మరియు డిజిటల్ సంతకాలు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి, ఫలితంగా ఒక గంటలోపు పత్రాలు అందుతున్నాయి. గతంలోరిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వారం రోజులకు డాక్యుమెంట్లు చేతికి వచ్చేవి.