సావిత్రి కోసం నాలుగు కోట్లు అడిగింద‌ట‌!

అల్లుడితో ఓ భారీ సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు స్టార్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్‌. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో దర్శ‌కుడిగా నిరూపించుకొన్న నాగ అశ్విన్‌… అశ్వ‌నీద‌త్ మామా అల్లుళ్ల‌న్న సంగ‌తి తెలిసిందే. నాగ్ అశ్విన్ రెండో ప్రాజెక్టు కోసం నెల రోజులుగా సుదీర్ఘ‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ‘సావిత్రి’ బ‌యోపిక్ ఆధారంగా తెర‌కెక్కించే సినిమా ఇది. సావిత్రి పాత్ర కోసం చాలామంది పేర్లు ప‌రిశీలించారు. ఈ సినిమాని బాలీవుడ్‌స్థాయిలో తీయాల‌న్న‌ది అశ్వ‌నీద‌త్ ప్లాన్‌. అందుకే అక్క‌డి నుంచి క‌థానాయిక‌ల్ని దిగుమ‌తి చేయాల‌ని చూస్తున్నారు. సావిత్రిగా మొద‌టి ఆప్ష‌న్‌.. విద్యాబాల‌న్‌. సావిత్రి స్టేచ‌ర్‌కి, సావిత్రి రూపానికి విద్యాబాల‌న్ అయితే స‌రిపోతుంద‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నార‌ట‌. విద్య ఓకే అంటే ఈసినిమాకి బాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వ‌స్తుంద‌ని, మార్కెట్ కూడా బాగా జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం. అయితే విద్యాబాల‌న్ మాత్రం రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దాంతో పాటు షూటింగ్ ఎక్క‌డ చేయాలి? అనే విష‌యాల‌పైనా కొన్ని సూచ‌న‌లు చేసింద‌ట‌. ఆమె డిమాండ్ల లిస్టు పెద్ద‌దే ఉంద‌ని టాక్‌. అయినా స‌రే.. ఈ సినిమాని విద్యాబాల‌న్‌తోనే తెర‌కెక్కించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ని స‌మాచారం. రెండు మూడు వారాల్లో సావిత్రికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వైజ‌యంతీ మూవీస్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close