సి.ఆర్.డి.ఏ.కమీషనర్ శ్రీకాంత్ బదిలీ..ఎందుకో?

రాజధాని ప్రాధికార సంస్థ (సి.ఆర్.డి.ఏ.) కమీషనర్ శ్రీకాంత్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేరే శాఖకి బదిలీ చేసింది. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టరుగా పనిచేస్తున్న చెరుకూరి శ్రీధర్ ని నియమించింది. శ్రీకాంత్ తో బాటు మరి కొందరు ఉన్నతాధికారులని కూడా బదిలీ చేసింది కనుక ఇది రొటీన్ వ్యవహారంగానే పైకి కనబడుతున్నప్పటికీ, అందుకు బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి నిర్మాణం కోసం ఆయనని ప్రభుత్వం ఏరికోరి సి.ఆర్.డి.ఏ.కమీషనర్ గా నియమించుకొని, వివిధ దేశాలలో అధ్యయనం కోసం కూడా పంపించింది. కానీ ఆయన పనితీరు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నందునే బదిలీ చేసినట్లు తెలుస్తోంది. లేకుంటే రాజధాని పనులు మొదలయ్యే ముందు ఆయనని బదిలీ చేసి ఉండరు.

తుళ్ళూరు మండలంలో నేలపాడు గ్రామంలోని రైతులని ఒప్పించడానికి గత ఏడెనిమిది నెలలుగా ప్రయత్నిస్తున్నా వారు తమ భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో వారి భూములని స్వాధీనం చేసుకొనేందుకు ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం క్రింద రైతులకి నోటీసులు ఇచ్చింది. ఆ వ్యవహారానికి శ్రీకాంత్ బదిలీకి ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆయనని విదేశాలకి పంపించి వివిధ నగరాలని అధ్యయనం చేయించిన తరువాత ఇప్పుడు వేరే శాఖకి బదిలీ చేయడం వలన, ఆయన విదేశీ యాత్రలపై పెట్టిన ఖర్చు అంతా వృధా అయిపోయినట్లే. అదీగాక రాజధాని నిర్మాణం విషయంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, కష్టనష్టాలు, సింగపూర్ తదితర విదేశీ సంస్థలతో చాలా సార్లు సంప్రదింపులు జరిపినందున వాటి గురించి ఆయనకి మంచి అవగాహన ఏర్పడి ఉండవచ్చు. అటువంటి వ్యక్తిని వేరే శాఖకి పంపించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడం వలన మళ్ళీ ఈ విషయాలన్నిటిపై అవగాహనా ఏర్పరుచుకొనడానికి ఆయనకీ కొంత సమయం పడుతుంది. ఆ కారణంగా పనులు నెమ్మదించవచ్చు. కనుక ఇతర ప్రభుత్వ శాఖలలోలాగ సి.ఆర్.డి.ఏ.లో అధికారులని బదిలీలు చేస్తే ఇటువంటి అనుమానాలు, ఊహాగానాలు కలిగే అవకాశం ఉంటుంది కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close