లష్కరే తోయిబావాళ్ళనే చంపుతానంటున్న పాక్ టెర్రరిస్ట్ నవేద్

హైదరాబాద్: కాశ్మీర్‌లోని ఉదమ్‌పూర్‌లో ఇటీవల పట్టుబడిన పాకిస్తాన్ తీవ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ మాట మార్చాడు. పట్టుబడిన సమయంలో హిందువులను చంపటం తనకు సరదాగా ఉంటుందని చెప్పిన నవేద్, ఇప్పుడు తనను వదిలిపెడితే – పాకిస్తాన్ వెళ్ళి తనను ఈ పనికి పంపిన లష్కరే తోయిబా వారిని చంపివస్తానని అంటున్నాడు. ఇంటరాగేషన్‌లో అతను మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తమను ఆత్మాహుతిదాడికి పంపేముందు ఒక మాదకద్రవ్యాన్ని తమకు ఇచ్చారని చెప్పాడు. దీనివలన తాము ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి తెలిపాడు. ఈ మాదకద్రవ్యంవలనే పట్టుబడినప్పుడు నవేద్ నవ్వుతూనే ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా విచారిస్తున్న తమకు నవేద్ ఒక్కటొక్కటేగా తన విశేషాలను చెబుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. తాను ఏ పనీలేకుండా తిరుగుతుండగా లష్కరే తోయిబాకు చెందిన మౌల్వీ ఒకరు పట్టుకుని తనలో భారతదేశంపట్ల ద్వేషాన్ని రగిల్చి ఈ పనికి పురిగొల్పారని నవేద్ చెప్పాడు. ఈ ఏడాది మార్చిలో తమకు ఆరువారాల శిక్షణ ఇచ్చి జూన్‌లో సరిహద్దుదాటించి భారత్‌లోకి పంపారని వెల్లడించాడు.

మరోవైపు నవేద్‌పై రేపు లైడిటెక్టర్ టెస్ట్ జరపటానికి ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఢిల్లీ కోర్టులో అనుమతి తీసుకున్నారు. అతని డీఎన్ఏ, స్వరనమూనాలనుకూడా అధికారులు తీసుకోనున్నారు. నవేద్, అతని సహచరుడు మొమిన్ ఈనెల ఐదోతేదీన ఉధమ్‌పూర్‌లో సైనికుల కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు చనిపోగా, డజనుమంది జవాన్లు గాయపడ్డారు. జవాన్లు జరిపిన ప్రతిదాడిలో మొమిన్ చనిపోగా, నవేద్‌ను సజీవంగా పట్టుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close