విమర్శకులపై ఫైర్ అయిన వెంకయ్య నాయుడు

హైదరాబాద్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్య నాయుడు ఇవాళ తాడేపల్లిగూడెంలో జరిగిన నిట్ సంస్థ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ తన విమర్శకులపై నిప్పులు చెరిగారు. ఎప్పుడూ సంయమనంగా ఉండే వెంకయ్యనాయుడు ఇవాళ ఆవేశంతో ఊగిపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ ఒక్క సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఏమేమి మంజూరు చేసిందో వివరిస్తే తనను విమర్శించేవారి నోట మాట రాదని అన్నారు. అయినా కొందరు విమర్శలు చేస్తూనే ఉంటారని, వారికి నిన్న గుర్తుండదని చెప్పారు. ఏదో ఒక తప్పుడు ప్రచారంచేయటమే వారిపని అన్నారు. తాను 40 ఏళ్ళుగా రాజకీయాలలో ఉన్నానని, అట్టడుగు స్థాయినుంచి పైకొచ్చానని చెప్పారు. వారసత్వ రాజకీయాలతో రాలేదని, రాజకీయాలలో వారసత్వంకాదు, జవసత్వం కావాలని అన్నారు. కులప్రాతిపదికపై, మతప్రాతిపదికపై తాను గెలవలేదని, గాలివాటు రాజకీయం చేయలేదని చెప్పారు. పుట్టినప్పటినుంచి అదే పార్టీలో ఉన్నానని, అదే పార్టీలో చస్తానని అన్నారు. చొక్కాలు మార్చినట్లుగా పార్టీలు మార్చేవారు తనను విమర్శిస్తారా అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిని అడ్డుకోవద్దని అన్నారు. విభజనబిల్లులో పేర్కొన్న ప్రతిఒక్క హామీని అమలు చేస్తామని చెప్పారు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని ఒకాయన అంటున్నాడని, తనకేమీ అభ్యంతరంలేదని అన్నారు. తాను వచ్చినప్పుడల్లా ఒక ప్రాజెక్ట్ వస్తుందని చెప్పారు. మోడి ప్రభుత్వం ఏపీకి మంజూరు చేసిన సంస్థల జాబితాను చదివారు. త్వరలో మంగళగిరిలో ఏఐఐఎమ్ఎస్ కూడా రాబోతోందని చెప్పారు. తనపై విమర్శలు చేసేవారిని తాను పట్టించుకోనని అన్నారు. తాను ఏపీ నుంచి ఎన్నిక కాలేదని, భవిష్యత్తులోకూడా నిలబడనని చెప్పారు.
నరేంద్ర మోడివైపు ప్రపంచమంతా చూస్తోందని, అమెరికా అధ్యక్షుడు ఒబామా రాక్ స్టార్ అన్నారని, రష్యా అధ్యక్షుడు పుతిన్ – హీ ఈజ్ ది మేన్ ఆఫ్ పీపుల్ అన్నారని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close