బడ్జెట్ రూ. 70 కోట్లు… పబ్లిసిటీ రూ. 7 కోట్లు

ప్రతీ సినిమాకీ పబ్లిసిటీ అవసరమే. చిన్న సినిమాలకూ, కొత్త సినిమాలకూ మరింత అవసరం. ఐతే ఆ సినిమా బడ్జెట్ తో మరో చిన్న సినిమా తీసేంత రేంజులో అయితే పబ్లిసిటీ అవసరం లేదనుకుంటా. జాగ్వార్ హడావుడి చూస్తే అదే అనిపిస్తోంది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ సినిమా హీరో. జాగ్వార్ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఏ నిర్మాత అయినా హీరో మార్కెట్ వాల్యూ ని బట్టే ఖర్చు పెడతాడు. కానీ హీరో ఇక్కడ ఓ మాజీ ప్రధానికి మనవడు, ఓ మాజీ ముఖమంత్రి తనయుడు. అందుకే డబ్బు వెదజల్లారు. ఈ సినిమాకి రూ. 70 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఆ లెక్కన ఇది సౌత్ ఇండియాలోనే ఖరీదైన డెబ్యూ.

టేకింగ్ కి అయిన ఖర్చు పక్కన పెడితే పారితోషికాల రూపంలో భారీ మొత్తం చెల్లించారట. ఉదాహరణకు జగపతి బాబు పారితోషికం 50 లక్షలు అనుకుందాం. ఈ సినిమాకి కోటిన్నర ఇచ్చారన్నమాట. కేవలం విజయేంద్ర ప్రసాద్ కథ కోసమే రూ. 75 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు పబ్లిసిటీ పై పడ్డారు. అందుకోసం రూ. 7 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఆదివారం జరిగిన ఆడియో వేడుక భారీ ఎత్తున సాగింది. ఓ స్టార్ హీరో స్థాయిలో జరిగింది. ఇందుకోసం పొలిటికల్ మీటింగ్ లా జనాన్ని సమీకరించారట. రాయచూర్ నుంచి 1000 మందిని దింపారని తెలుస్తోంది. ఎంత హంగామా చేసినా కథలో, సినిమాలో దమ్ము ఉండాలి. లేదంటే సినిమా చూడ్డానికి కూడా జీతాలిచ్చి జనాలని దింపాల్సి వస్తుంది. మరి ఆ దమ్ము ఇందులో ఉందొ లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close