ఈ ‘మజ్ను’ కి ఏమయ్యింది ?

నానిని ఇప్పుడు బుల్లి హీరోలా చూడ‌కూడ‌దు. అప్ క‌మింగ్‌ స్టార్ హీరో కేట‌రిగిలో నాని ఎప్పుడో చేరిపోయాడు. అత‌ని సినిమాకి రూ.30 కోట్లు కొల్లగొట్టగ‌ల స్టామినా ఉంద‌ని ఇది వ‌ర‌కే నిరూపిత‌మైంది. ఓవ‌ర్సీస్ లో నానికి తిరుగులేకుండా పోతోంది. మిలియ‌న్ డాల‌ర్ల క్లబ్ లో నాని సినిమాలు ఈజీగా చేరిపోతున్నాయి. వ‌రుస విజ‌యాల‌తో త‌న ఇమేజ్‌, మార్కెట్ రోజు రోజుకీ పెంచుకొంటున్నాడు. త‌న తాజా చిత్రం మ‌జ్ను ఈ వార‌మే ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. అయితే.. మ‌జ్నుకి సంబంధించిన ప్రమోష‌న్స్ మాత్రం డ‌ల్‌గా సాగుతున్నాయి. అస‌లు ఈ సినిమా వ‌స్తోంద‌న్న స‌డే లేదు. నాని సినిమా మ‌రీ బ‌జ్ లేకుండా రిలీజ్‌కి సిద్దం అవ్వడం ఈమ‌ధ్య కాలంలో ఇదే తొలిసారేమో. నాని సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు క‌దా, ప‌బ్లిసిటీ లేక‌పోయినా న‌డిచిపోతుందిలే అనే ధీమా నిర్మాత‌ల‌కు ఉందేమో? ఓవైపు జాగ్వార్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు ప్రమోష‌న్ల‌తో హోరెత్తించేస్తోంటే, మ‌జ్ను చ‌ప్పుడు చేయ‌క‌పోవ‌డం ఆశ్చర్యప‌రుస్తోంది.

మజ్ను ప‌బ్లిసిటీ విష‌యంలో నాని కూడా నిరాశ‌గానే ఉన్నాడ‌ట‌. ఇదే విష‌య‌మై నిర్మాత‌లో గ‌ట్టిగా మాట్లాడాడ‌ట కూడా. ప్రమోష‌న్లు మీరు చేస్తారా, న‌న్ను చేసుకోమంటారా? అని నాని నిల‌దీయ‌డంతో… స‌డ‌న్‌గా తేరుకొన్న నిర్మాత‌లు బుధ‌వారం నుంచి ప్రమోష‌న్ల స్పీడు పెంచాల‌ని చూస్తున్నారు. సెన్సార్ టాక్ కాస్త డ‌ల్‌గా ఉండ‌డంతో చిత్రబృందం కాస్త నిరాశ‌కులోన‌య్యింద‌ని అందుకే ప్రమోష‌న్ల‌పై దృష్టి నిల‌ప‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌జ్నుకి పోటీగా ఏ సినిమా లేక‌పోవ‌డంతో మ‌జ్ను బృందం ధీమాగా ఉంద‌ని, అందుకే ప‌బ్లిసిటీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, రిలీజ్ త‌ర‌వాత టాక్‌ని బ‌ట్టి ప‌బ్లిసిటీ విష‌యంలో వ్యూహం మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close