మహేష్బాబు, త్రివిక్రమ్లు కలిసి సినిమా చేస్తున్నారంటే అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తి చూపిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా? అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. మహేష్ 25వ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా ఎలా ఉండాలి అనే విషయంలో ఇద్దరూ ఓ స్పష్టతకు వచ్చారట. ఇద్దరి కెరీర్స్లోనూ గత కొన్ని సినిమాలుగా లేకుండా పోయిన జానర్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. అతడు సినిమాతో తనలో ఉన్న యాక్షన్ యాంగిల్ తాలూకూ శాంపిల్ చూపించిన మహేష్…ఆ తర్వాత పోకిరి సినిమాతో పీక్ స్థాయి యాక్షన్ని చూపించి ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత నుంచి మాత్రం మళ్ళీ అలాంటి సినిమా ఎప్పుడూ చేయలేకపోయాడు. ఇప్పుడు మురుగదాస్తో చేస్తున్న సినిమా, ఆ తర్వాత కొరటాల శివతో చేయబోయే సినిమాలు కూడా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కావు.
త్రివిక్రమ్ కెరీర్ కూడా సేం టు సేం. అతడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ని త్రివిక్రమ్ ఇవ్వలేకపోయాడు. మధ్యలో జులాయి సినిమాను పక్కన పెడితే అన్నీ కూడా లవ్, ఫ్యామిలీ డ్రామాలే. అందుకే మహేష్ బాబు 25వ సినిమాగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించాలనే ప్రయత్నాల్లో త్రివిక్రమ్ ఉన్నాడట. అతడు సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ చూసిన మెగాస్టార్ చిరంజీవి కూడా…తెలుగు సినిమాను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్ళే సినిమా అని అభినందించాడు. ఇప్పుడు మహేష్ 25వ సినిమాతో కూడా మరోసారి అలాంటి మేజిక్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఈ విషయమై ఇద్దరూ మాట్లాడుకున్నారని, హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే చేద్దామని ఫిక్స్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.