మజ్ను… టైం బాడ్

నాని సినిమా అంటే ‘హాయిగా ఓసారి చూడొచ్చు’ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అతనికి యంగ్ ఆడియన్స్ సపోర్ట్ తో పాటు, ఫామిలీ ఆడియన్స్ దీవెనలూ వున్నాయి. అందుకే బాక్స్ ఆఫీస్ దగ్గర నాని సినిమాలు వసూళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. నాని సినిమా అంటే భారీ ఓపెనింగ్ రావడం కూడా ఖాయమైపోయింది. వరుస విజయాల నేపధ్యం లో మజ్ను సినిమా కీ అదే స్థాయి లో ఓపెనింగ్ వస్తాయని ఆశపడింది చిత్ర బృందం. అయితే భారీ వర్షాల ఎఫెక్ట్ మజ్ను పై బాగా పడింది. గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. గురువారం సాయత్రం మొదలైన వర్షం శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ఆ ఎఫెక్ట్ మజ్ను సినిమా పై పడింది. సాధారణం గా నాని సినిమా అంటే తొలి రోజున 90 నుంచి 100 శాతం థియేటర్లు ఫుల్ అవుతాయి. కానీ మజ్ను మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ చెయ్యలేదు. ఎక్కడ చూసినా 60 శాతం టికెట్లు కూడా తెగలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి.

మల్టీప్లెక్స్ లలో కూడా అదే పరిస్థితి. వర్షం కారణంగా ఇంట్లోంచి బయటకి రావడానికి జనం జంకుతున్నారు. ఇక సినిమాలేం చూస్తారు.? అందుకే మజ్ను కి వసూళ్లు నీరసంగా వున్నాయి. శనివారం కూడా భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ సూచన ప్రజలకే కాదు.. మంజు బృందానికి తలనొప్పి తెస్తోంది. అందుకే నాని కూడా వార్షాలు తగ్గిపోవాలి.. మా సినిమా కోసం కాదు.. ప్రజల కోసం అంటూ ట్వీట్ చేసాడు. జనతా గ్యారేజ్ పై కూడా ఈ వర్షాలు పెను ప్రభావాన్ని చూపించాయి. వర్షం పడని రోజు నైజం లో ఒక్కరోజుకి రూ. 20 లక్షల దాకా వసూళ్లు వస్తే… వర్షం పడిన రోజు రూ. 1 లక్ష కి పడిపోతున్నాయట. వర్షం ఎఫెక్ట్ ఎంతో చెప్పడానికి ఎంత కంటే ఉదాహరణ ఏం కావాలి. టైం బాడ్ అనుకోవాలంతే .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close