గెస్ట్ రోల్ వద్దు… వాయిస్ ఓవర్ చాలు

పూరీజగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇజం’. హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకి ఎక్స్ట్రా క్రేజ్ తీసుకురావడానికి పూరి పెద్ద స్కెచ్చే వేశాడు. ఎన్టీఆర్ తో ఈ సినిమాలో గెస్ట్ అప్పీల్ ఇప్పించి.. దాంతో ఎన్టీఆర్ అభిమానులని ఆకర్షించాలని చూశాడు. ఎన్టీఆర్ యాడ్ అయితే బిజినెస్ పరంగా కూడా క్రేజ్ వస్తుందని భావించాడు పూరి. నిర్మాత ఎలాగూ కళ్యాణ్ రామ్ కాబట్టి ఎన్టీఆర్ సులభంగా ఒప్పుకుంటాడన్నది పూరి ప్లాన్. ఐతే ఈ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడట ఎన్టీఆర్.

”గెస్ట్ రోల్ వద్దు… కావాలంటే వాయిస్ ఓవర్ ఇస్తా” అన్నాడట. క్రేజ్ కోసం కావాలని తన పాత్ర ఇరికించినా లాభం ఉండదని, రెండు నిమిషాలు తెరపై కనిపించినంత మాత్రాన సినిమాకి అదనంగా ఒనగూరేది ఉండదని పూరితో చెప్పాడట. వాయిస్ ఓవర్ అయితే ఎలాంటి అభ్యంతరం లేదన్నాడట. ”అన్నయ్య తో కలసి కనిపిస్తా. ఐతే పూర్తి స్థాయి సినిమా ఐతే బాగుంటుంది అలాంటిది ఏమైనా ఉంటే ప్లాన్ చెయ్యమన్నా”డట. సో… ఇజం లో ఎన్టీఆర్ కనిపించడు. వినిపిస్తాడంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close