పూరీజగన్నాధ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇజం’. హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాకి ఎక్స్ట్రా క్రేజ్ తీసుకురావడానికి పూరి పెద్ద స్కెచ్చే వేశాడు. ఎన్టీఆర్ తో ఈ సినిమాలో గెస్ట్ అప్పీల్ ఇప్పించి.. దాంతో ఎన్టీఆర్ అభిమానులని ఆకర్షించాలని చూశాడు. ఎన్టీఆర్ యాడ్ అయితే బిజినెస్ పరంగా కూడా క్రేజ్ వస్తుందని భావించాడు పూరి. నిర్మాత ఎలాగూ కళ్యాణ్ రామ్ కాబట్టి ఎన్టీఆర్ సులభంగా ఒప్పుకుంటాడన్నది పూరి ప్లాన్. ఐతే ఈ ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరించాడట ఎన్టీఆర్.
”గెస్ట్ రోల్ వద్దు… కావాలంటే వాయిస్ ఓవర్ ఇస్తా” అన్నాడట. క్రేజ్ కోసం కావాలని తన పాత్ర ఇరికించినా లాభం ఉండదని, రెండు నిమిషాలు తెరపై కనిపించినంత మాత్రాన సినిమాకి అదనంగా ఒనగూరేది ఉండదని పూరితో చెప్పాడట. వాయిస్ ఓవర్ అయితే ఎలాంటి అభ్యంతరం లేదన్నాడట. ”అన్నయ్య తో కలసి కనిపిస్తా. ఐతే పూర్తి స్థాయి సినిమా ఐతే బాగుంటుంది అలాంటిది ఏమైనా ఉంటే ప్లాన్ చెయ్యమన్నా”డట. సో… ఇజం లో ఎన్టీఆర్ కనిపించడు. వినిపిస్తాడంతే.