కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వార్నింగ్

కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈరోజు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు తమిళనాడుకి కావేరీ నీళ్ళు వదలాలని తన ఆదేశాలని పాటించనందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 1 నుంచి 6 వరకు రోజుకు 6,000 క్యూసెక్కుల తమిళనాడుకి తప్పనిసరిగా నీళ్ళు విడుదలచేయాలని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టంగా చెప్పింది. ఈసారి తన ఆదేశాలని నిర్లక్ష్యం చేస్తే సహించబోనని కూడా హెచ్చరించింది. అలాగే ఈ వివాదం పరిష్కారం కోసం అక్టోబర్ 4వ తేదీ లోగా కావేరీ రివర్ బోర్డుని ఏర్పాటు చేయాలని, రేపటిలోగానే దానికి సభ్యులని నియమించాలని కేంద్రప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

కావేరీ జలాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు మొదటిసారి ఆదేశాలు జారీ చేసినప్పుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానిలో పాల్గొన్న ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు ఆదేశాలని పట్టించుకోవద్దని, అవసరమైతే ముఖ్యమంత్రికి తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చాయి. మంత్రివర్గ సభ్యులు కూడా అలాగే చెప్పడంతో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి నీళ్ళు విడుదల చేయలేదు. ఈ నేపధ్యంలో గురువారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. ఈసారైనా సుప్రీంకోర్టు ఆదేశాలని సిద్ద రామయ్య పాటిస్తారో లేదో? పాటించక పోతే సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకొంటుందో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close