అమెరికాలో కాల్పుల కలకలం, రిపోర్టర్, కెమెరామెన్ కాల్చివేత

అమెరికాలో అనూహ్య ఘటన. ప్రత్యక్ష ప్రసారంలో ఓ మహిళను ఇంటర్ వ్యూ చేస్తున్న మహిళా విలేకరిని, కెమెరామెన్ ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. వర్జీనియాలో జరిగిందీ దారుణం. ఓ ఇంటి డాబాపై మహిళను ఇంటర్ వ్యూ చేస్తుండగా దుండగుడు హటాత్తుగా వెనక వైపు నుంచి వచ్చాడు.

డబ్బ్యు డి బి జె 7 చానల్ కు చెందిన కెమెరామెన్ ను, రిపోర్టర్ ను, ఇంటర్ వ్యూ ఇస్తున్న మహిళను పిస్టల్ తో కాల్చాడు. ఈ ఘటనలో 24 ఏళ్ల రిపోర్టర్ అలిసన్ పార్కర్, 27 ఏళ్ల కెమెరామన్ ఆడమ్ వార్డ్ మరణించాడు. గాయపడ్డ మరో మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సర్జరీచేసి ఆమెకు ప్రాణాపాయం తప్పించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

గతంలో అదే చానల్ లో పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. సరిగా పనిచేయక ఉద్యోగం లోంచి తీసేసిన వ్యక్తి పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. చానల్ యాజమాన్యం కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

అయితే కొన్ని టీవీచానళ్లు హటాత్తుగా ఓ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి. రిపోర్టర్ ను, కెమెరామన్ ను కాల్చి చంపిన దుండగుడు తనను తాను కాల్చుకున్నాడని తెలిపాయి. అయితే అతడు మరణించాడా లేక సజీవంగా ఉన్నాదా అనేది నిర్ధారించలేదు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close