రేపు తెదేపాలో చేరనున్న డొక్కా మాణిక్యం?

మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రేపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన రాజకీయ గురువు తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివ రావు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్దపడ్డారు. కానీ రాయపాటి సలహా మేరకు ఆయన ఆఖరు నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. కనుక ఆయనను తెదేపాలో చేర్చుకొనేందుకు రాయపాటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఒప్పించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తరువాత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీని వీడుతున్నారు. ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొని రాష్ర్టంలో మళ్ళీ పార్టీని బలపరుచుకొందామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకరి తరువాత మరొకరు పార్టీ నుండి బయటకు జారిపోతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close