చంద్రబాబు జగ్గారెడ్డిని బీజేపీలో ఎందుకు చేర్చారు?

హైదరాబాద్: భారతీయ జనతాపార్టీనుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ఒక విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరి సమక్షంలో ఆర్భాటంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగ్గారెడ్డి, నాడు తనకు చంద్రబాబు ఫోన్ చేసి, బీజేపీలో చేరితే భవిష్యత్తు ఉంటుందని చెప్పటంవలనే తాను తొందరపడ్డానని చెప్పుకొచ్చారు. మరోవైపు – తాను బీజేపీలో ఎందుకు చేరానో తనకే తెలియదని, ఆ సమయంలో ఏవేవో ఆలోచనలతో ఆ పార్టీలో చేరాననికూడా జగ్గారెడ్డి చెప్పారు. తన నోటి దురుసుతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయానని, ఉద్యోగులు అధికారపార్టీకి దూరమవటంకూడా తన ఓటమికి కారణమయిందని అన్నారు. తదుపరి ఎన్నికల్లో సంగారెడ్డిలో గడిచితీరుతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో మంత్రులు అడుగుపెట్టటానికే భయపడేటట్లు చేస్తానని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత 800మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగ్గారెడ్డి అనుచరులు జనాన్ని పెద్ద ఎత్తున తరలించారు. అయినా, చంద్రబాబు ఒక వేళ చేరమని చెబితే – గిబితే తమ పార్టీ తెలుగుదేశంలో చేరమంటారుగానీ బీజేపీలో ఎందుకు చేరమంటారన్నది ఇప్పుడు అందరికీ ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. చంద్రబాబును జగ్గారెడ్డి వివాదంలోకి ఎందుకు లాగారో టీడీపీ నేతలే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close