ఒన్స్‌మోర్….లోకేష్ తగ్గడంతే

చంద్రబాబు నాయుడు కొడుకుని, ఎన్టీఆర్ మనవడిని…రాజకీయాలు నా రక్తంలోనే ఉన్నాయి అని చెప్పుకునే లోకేష్ ప్రసంగాలు రోజు రోజుకూ కామెడీ అయిపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబేమో స్కూల్ ఎడ్యుకేషన్ టైంలోనే నారా లోకేష్ తనకు రాజకీయ సలహాలిచ్చేశాడని చెప్తూ ఉంటాడు. మరోవైపు లోకేష్ మాత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా కనీసం ప్రసంగాలలో తప్పులు లేకుండా మాత్రం జాగ్రత్తపడలేకపోతున్నాడు. మంత్రి అవ్వకముందు కూడా తన స్పీచ్‌లతో టిడిపిని ఇబ్బంది పెట్టిన లోకేష్ మంత్రి అయిన తర్వాత నుంచీ మాత్రం మరికాస్త జోరు పెంచేశాడు. రోజుకో తప్పిదం చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నాడు.

ప్రమాణ స్వీకారాన్ని కూడా స్పష్టంగా చేయలేకపోయిన లోకేష్….అంబేద్కర్ జయంతి నాడు మరోసారి స్లిప్ అయ్యాడు. ఇక నిన్న గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్య గురించి చెప్తూ పూర్తి రివర్స్ అర్థం వచ్చేలా మాట్లాడేశాడు. ఈ రోజు అనంతపురం పర్యటనకు వెళ్ళిన లోకేష్ అక్కడ జనాలకు కూడా షాక్ ఇచ్చాడు. షరా మామూలుగా వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబునే గెలిపించాలన్న జనాలకు పిలుపునిచ్చిన లోకేష్ ఎమ్మెల్యే సీట్ల విషయంలో మాత్రం 200 అనే ఫిగర్‌ని కోట్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. రాష్ట్రంలో ఉన్న రెండొందలకు రెండొందల సీట్లలోనూ టిడిపిని గెలిపించి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చాడు లోకేష్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నదే 175 స్థానాలు అన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు ఈ 200 స్థానాల లెక్కేంటో లోకేషే చెప్పాలి. ఇంత వరకూ టంగ్ స్లిప్పులతో దొరికిపోయిన లోకేష్ ఈ సారి మాత్రం తన నాలెడ్జ్‌నే శంకించేలా మాట్లాడేశాడు. కనీసం అసెంబ్లీ స్థానాలు ఎన్నో కూడా తెలియని నాయకుడికి మంత్రిగా నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపైన ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నించేలా చేసుకున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

రిజర్వేషన్లపై కేసీఆర్ సైలెన్స్… కవిత కోసమేనా..?

దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై రగడ కొనసాగుతోంది. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని, రాజ్యాంగం రద్దుకు మద్దతు ఇవ్వడమేనని కాంగ్రెస్ వాదిస్తుండగా.. తాము రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి...

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close