33 కోట్లు ఖ‌ర్చు పెట్టించావా.. మా నాయ‌నే..!

మిస్ట‌ర్ రూపంలో శ్రీ‌నువైట్ల ఖాతాలోకి మ‌రో డిజాస్ట‌ర్ చేరిపోయింది. ఈ సినిమాపై ఎవ్వ‌రికీ ముందు నుంచి న‌మ్మ‌కాల్లేవు. అయితే మ‌రీ ఇంత దారుణంగా ఉంటుంద‌ని ఊహించ‌లేక‌పోయారు. అన్నిటికి మించి నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జిల‌కు ఇది వ‌రుస‌గా రెండో `మెగా` దెబ్బ‌. ఇంత‌కు ముందు వ‌చ్చిన `విన్న‌ర్‌`కీ వీళ్లే నిర్మాత‌లు. మిస్ట‌ర్ కోసం శ్రీ‌నువైట్ల ఏకంగా రూ.33 కోట్లు ఖ‌ర్చు పెట్టించాడ‌ట‌. ఈ అంకె మ‌రీ టూమ‌చ్‌. పారితోషికాల ప‌రంగా ఎవ్వ‌రికీ పెద్ద‌గా ఇవ్వ‌క‌పోయినా, టేకింగ్ విష‌యంలో రాజీ ప‌డ‌క పోవ‌డం వ‌ల్ల ఈ స్థాయిలో బ‌డ్జెట్ పెట్టాల్సివచ్చింద‌ట‌.

సినిమా విడుద‌ల‌కు వారం రోజుల ముందు ఓ పాట తెర‌కెక్కించార్ట‌. అందుకోసం ఏకంగా రూ.80 ల‌క్ష‌ల‌య్యింద‌ని స‌మాచారం. ఆ పాట వ‌ద్దు… అని నిర్మాత‌లు మొత్తుకున్నా, శ్రీ‌నువైట్ల విన‌లేద‌ట‌. ఓ కామెడీ సీన్ కోసం ఊర్లోఉన్న ఇళ్ల‌ని తెల్ల పెయింట్ వేయించాడ‌ట‌. వంద‌ల మంది జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చాడ‌ట‌. అయితే ఆ సీన్ పేల‌లేదు. ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన ఖర్చులు చాలా చేయించాడ‌ని, అందుకే బ‌డ్జెట్ త‌డిసిమోపెడ‌య్యింద‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాత‌లు పూర్తిగా న‌ష్ట‌పోవ‌డంతో, ప‌రిహారం క్రింద శ్రీ‌నువైట్ల కొంతమొత్తం వెన‌క్కి ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని, అందుకే ఫ్లాట్ అమ్మ‌కానికి పెట్టాడ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close