మ‌ణిర‌త్నంని మ‌ర్చిపోయిన చ‌ర‌ణ్‌

మ‌ణిర‌త్నంతో సినిమా అన‌గానే ఎగిరి గంతేస్తార‌ని అనుకొంటారంతా. కానీ.. ఎవ‌రి లెక్క‌లు వాళ్ల‌కు ఉంటాయి. ఎప్పుడు ఏ ద‌ర్శ‌కుడితో చేయాలో, ఎప్పుడు ఎలాంటి క‌థ‌ల్ని ఎంచుకోవాలో స్టార్ హీరోల‌కు బాగా తెలుసు. ‘సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా ఫ‌ర్లేదు.. మ‌ణిర‌త్నంలాంటి ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తే అదే ప‌ది వేలు’ అనుకొనేవాళ్లు ఈ రోజుల్లో మాత్రం అరుదే. అందుకే మ‌ణిర‌త్నంకి హీరోలు క్ర‌మంగా దూర‌మైపోతున్నారు. తాజాగా చెలియా సినిమా మ‌రింత ఎఫెక్ట్ చూపించింది. చెలియా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఎవ‌రికి వాళ్లు జాగ్ర‌త్త‌ప‌డిపోతున్నారు. రామ్ చ‌ర‌ణ్ కూడా.. ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమా విష‌యంలో సైలెంట్‌గా ఉన్న‌ట్టు భోగ‌ట్టా.

సుకుమార్ సినిమా త‌ర‌వాత మ‌ణిర‌త్నం సినిమానే మొద‌ల‌వుతుంది అనుకొన్నారు. మ‌ణిర‌త్నం ఇప్ప‌టికే చ‌ర‌ణ్ కి ఓ లైన్ వినిపించాడు. అయితే చెలియా రిజ‌ల్ట్ త‌ర‌వాత‌.. చిరు జాగ్ర‌త్త‌ప‌డిపోయిన‌ట్టు స‌మాచారం. చ‌ర‌ణ్ కూడా మ‌ణిర‌త్నం సినిమా విష‌యంలో భ‌య‌ప‌డుతున్నాడ‌ట‌. ”సుకుమార్‌తో సినిమా ఓ ప్ర‌యోగం.. మ‌ణిర‌త్నం సినిమా కూడా దాదాపుగా అలాంటిదే. వ‌రుస‌గా రెండు ప్ర‌యోగాలు చేయ‌డం ఏ హీరోకైనా క‌ష్ట‌మే. అందుకే మ‌ణిర‌త్నం సినిమా నుంచి చ‌ర‌ణ్ డ్రాప్ అయ్యే ఛాన్సులున్నాయి” అంటూ మెగా కాంపౌండ్ వ‌ర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుకుమార్ సినిమా త‌ర‌వాత ఎవ‌రితో ప‌నిచేయాలో చ‌ర‌ణ్ ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌న్న‌ది మెగా పీఆర్వోల మాట‌. అంటే. మ‌ణి ర‌త్నాన్ని ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మైపోయింద‌న్న‌మాట‌

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close