చల్లగా ఉంటుందని చంద్రబాబు…..మరి జగన్ ఎందుకో?

తాను చేసిన విమర్శలకు, కామెంట్స్‌కు తానే బుక్కవ్వడం జగన్‌కి కొత్తేమీకాదు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసి బయటకు వచ్చాక…..ఓ ఇరవై ఇరవై ఐదుమంది ఎమ్మెల్యేలు మావైపు వచ్చేస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టేస్తానని యథాలాపంగా ఓ స్టేట్‌మెంట్ పడేశాడు జగన్. జగన్‌ మాటను పట్టుకుని వైకాపాను షేక్ చేసి పడేశాడు చంద్రబాబు. ఫిరాయింపు ఎమ్మెల్యేల సంఖ్య భారీగా పెరిగిపోతున్న టైంలో అయితే వైకాపాకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఉంటుందా అన్న అనుమానాలు వచ్చాయి. అలాగే తెలంగాణాలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ కూడా మాదే అసలైన పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ లో కలిసిపోయినట్టుగా ఇక్కడ వైకాపాను కూడా చంద్రబాబు టిడిపిలో కలిపేసుకుంటారా అన్నంత వరకూ ఊహాగానాలు వినిపించాయి. ప్రభుత్వాన్ని పడగొడతా అన్న మాటలు అలా ఆ స్థాయిలో జగన్‌కి నష్టం చేశాయి.

చంద్రబాబు అమెరికా టూర్ వెళ్ళినప్పుడు…..పెట్టుబడుల కోసం కాదు…చల్లగా ఉంటుందని వెళ్ళాడు అని జగన్ ఓ కామెంట్ పాస్ చేశాడు. ఇఫ్పుడు అదే కామెంట్ పట్టుకుని జగన్‌పైన సెటైర్స్ వేస్తున్నారు నెటిజనులు. చల్లగా ఉంటుందన్న ఉద్ధేశ్యంతోనే చంద్రబాబు అమెరికా వెళ్ళాడన్న జగన్ విమర్శ కరెక్టే అనుకుందాం. మరి ఇఫ్పుడు జగన్ న్యూజిలాండ్ ఎందుకు వెళ్తున్నట్టు? చంద్రబాబు ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళి ఉండొచ్చు. జగన్‌వి సొంత ఖర్చులే అయ్యే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ప్రతిపక్షనేత అయిన జగన్‌కి కూడా ప్రభుత్వం నుంచి కొంత ఫండింగ్ ఉంటుందనుకోండి. అయినప్పటికీ ఎండలు ఎక్కువై జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు ….ప్రతిపక్ష నేత అయిన జగన్ మాత్రం చల్లగా ఉంటుందని చెప్పి న్యూజిలాండ్ చెక్కెయ్యడం ఎంత వరకూ న్యాయం? మామూలుగా అయితే జగన్ టూర్‌పై విమర్శలు వచ్చేవి కాదేమో కానీ ‘చల్లగా ఉంటుందని చంద్రబాబు అమెరికా టూర్ వెళ్ళాడు’ అన్న జగన్ విమర్శే బూమరాంగ్ అయి ఇప్పుడు జగన్‌పైన సెటైర్స్ పడేలా చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close