ఎన్టీఆర్‌గా న‌టించ‌మంటే… ఎన్టీఆర్ ఏమ‌న్నాడో తెలుసా??

సావిత్రి జీవిత క‌థ‌ని `మ‌హాన‌టి` పేరుతో తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొన్నారు. చిన్న సినిమాగా అనుకొన్నా.. రాను రాను ఓ భారీ సినిమాగా రూపాంతరం చెందుతూ వ‌స్తోంది మ‌హాన‌టి. సావిత్రి జీవిత క‌థ అంటే ఆ త‌రం అగ్ర న‌టీన‌టుల్ని చూపించాల్సిందే. మ‌రీ ముఖ్యంగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పాత్ర‌లు త‌ప్ప‌ని స‌రి. ఈ పాత్ర‌ల్లోఎవ‌రు క‌నిపిస్తార‌న్న ప్ర‌శ్న‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ని ఊపేస్తోంది. ఎన్టీఆర్ గా జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే… ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని చిత్ర‌బృందం కొట్టి ప‌రేసింది.

నిజానికి ఎన్టీఆర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ని సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మే అని తెలిసింది. ఎన్టీఆర్‌కి క‌థ‌, త‌న పాత్ర గురించి మొత్తం చెప్పార్ట‌. కానీ.. ఎన్టీఆర్ మాత్రం ”తాత‌య్య‌గా క‌నిపించే స్థాయి నాకు లేదు.. ఆ పాత్ర‌ని క్యారీ చేసేంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదు” అన్నాడ‌ట‌. ఎన్టీఆర్‌ని ఎన్నివిధాలుగా ఒప్పించ‌డానికి ప్ర‌య‌త్నించినా, ఎన్టీఆర్ నుంచి సానుకూల స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. జూనియ‌ర్‌కీ అశ్వ‌నీద‌త్‌కీ మ‌ధ్య మంచి అనుబంధ‌మే ఉంది. ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన శ‌క్తి అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సానుభూతితో అయినా.. ఎన్టీఆర్ ఈ సినిమాకి ఓకే చెబుతాడనుకొన్నారంతా. అయితే.. ఎన్టీఆర్ మాత్రం.. ‘నో’ అంటున్నాడు. అయితే చివ‌రి వ‌ర‌కూ ఎన్టీఆర్ డేట్ల కోసం ఎదురుచూద్దామ‌ని, కాని ప‌క్షంలో ప్ర‌త్యామ్నాయం ఆలోచించాల‌ని అశ్వ‌నీద‌త్ భావిస్తున్నార్ట‌. మ‌రి ద‌త్తు ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close