రచ్చగెలిచి ఇంట ఓడిన షా

ఇంటగెలిచి రచ్చగెలవాలంటారు గాని అదేమంత తేలిక కాదని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా మరోసారి నిరూపించారు. ప్రధాని మోడీ సహచరుడుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలు రావడానికి వ్యూహ రచన చేసిన షా స్వంత రాష్ట్రంలో దెబ్బ తిన్నారు. అది కూడా ఆగర్భ శత్రువులాటి సోనియా సలహాదారు అహ్మద్‌ పటేల్‌ను రాకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలం కావడం రాజకీయ శృంగభంగమే.శంకర్‌ సింగ్‌ వాఘేలా వర్గం తిరుగుబాటు, ఇతర చిన్న పార్టీలలోనూ చీలికలు, కర్ణాటకలో కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎల క్యాంపు నిర్వాహకుడైన మంత్రి శివకుమార్‌పై ఐటి దాడి ఇన్ని చేసిన తర్వాత కూడా పటేల్‌ ఎలాగో బయిటపడి రాజ్యసభకు తనతో పాటు వస్తున్నారంటే అమిత్‌ షాకు అది కుదుపే. రెండు ఓట్లు చెల్లకుండా చేయడం కోసం కాంగ్రెస్‌ చేసిన ఫిర్యాదుకు అవకాశం ఇచ్చిన వారిలో షా ఒకరు. వాఘేలా వర్గానికి చెందిన ఇద్దరు ఎంఎల్‌ఎలు తమ ఓటును బిజెపి ఏజంటుతో పాటు అమిత్‌ షాకు కూడా చూపించారంటే ఆయన ఎంత అనాలోచితంగా దొరికిపోయారో అర్థమవుతుంది. డిసెంబరులో ఎన్నికలు జరగాల్సిన గుజరాత్‌లో ఇది కాంగ్రెస్‌కు వూపిరిపోస్తుంది. రాజ్యసభలో మొదటి సారి పెద్ద పార్టీగా వచ్చామన్న బిజెపి సంతోషానికి పగ్గాలు వేస్తుంది. ప్రమాదో ధీమతామపి అంటారు. ఎంత తెలివైన వారికైనా చిక్కులు తప్పవు మరి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close