‘పిల్లల ఎఫ్‌బీ వాడకంపై కన్నేసి ఉంచండి’

హైదరాబాద్: పిల్లల ఫేస్‌బుక్ వాడకాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో అబ్దుల్ మాజీద్ అనే బీటెక్ స్టూడెంట్ నకిలీ ఫేస్ బుక్ ఎకౌంట్లతో ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రముఖ కళాశాలల్లో చదివే ఆడపిల్లలతో స్నేహంచేసి వారిని మోసగించిన విషయం నిన్న బయటపడిన నేపథ్యంలో పోలీసులు ఈ హెచ్చరికలు చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలో ఏమి చేస్తున్నారో తెలియదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు సైబర్ సెక్యూరిటీగురించి వివరించాలని సూచించారు. ముఖ్యంగా టీనేజర్‌ల సోషల్ మీడియా వాడకాన్ని ఎల్లప్పుడూ గమనించాలని చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అన్ని అంశాలనూ పాఠశాలల్లో తప్పనిసరిగా బోధించేటట్లు తెలంగాణలో కొత్త చట్టం రాబోతున్నట్లు తెలిపారు.

తాజాగా బయటపడిన అబ్దుల్ మాజీద్ వ్యవహారంలో అతను దాదాపు 200మంది ఆడపిల్లలతో నకిలీ ఫేస్‌బుక్ ఎకౌంట్ల ద్వారా ఫ్రెండ్‌షిప్ చేసుకుంటే, ఆ ఆడపిల్లల తల్లిదండ్రులెవరికీ ఈ విషయంగురించి కొద్దిగాకూడా తెలియదని ఆనంద్ చెప్పారు. ఆ పిల్లలుకూడా వారి తల్లిదండ్రులకు చెప్పలేదని తెలిపారు. పిల్లలు తమ సమస్యలను చెప్పుకునే అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలని అన్నారు. అబ్దుల్ మాజీద్ ఈ 200మంది ఆడపిల్లల్లో చాలామందిని బుట్టలో వేసుకుని వారి నగ్నచిత్రాలను, సంభాషణలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకున్నాడు. ఆ 200మందిలో ఒక అమ్మాయి బయటకొచ్చి ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం బయటపడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close