ఇక పై టిడిపి “వాణి” వినిపిస్తుంది

వాణీ విశ్వనాథ్. నిన్నటి తరం ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు. ఘరనా మొగుడు, కొదమ సింహం లాంటి సినిమాల తో తెలుగు ప్రేక్షకులని అలరించిన హీరోయిన్. అగ్ర హీరోయిన్ స్థాయికి తెలుగులో ఎదగపోయినా చాలా సినిమాల్లో, అందులోనూ కుటుంబ కథా చిత్రాల్లో నటించి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగ దగ్గరైన నటి. అనేక భాషల్లో నటించిన ఈవిడ ఇప్పుడు రాజకీయ ఆరంగేట్రం చేయబోతోంది.

తనకు టిడిపి నుంచి ఆహ్వానం వచ్చిందనీ, త్వరలోనే చంద్రబాబు ని కలుస్తానని చెప్పిన వాణీ విశ్వనాథ్, ఏపి లో పాలన బాగుందని, రాముడు పరిపాలిస్తునట్టుగా ఉందనీ బాబుకి కితాబిచ్చింది. ఐతే ఒకప్పుడు టిడిపి లో ఉండి ఇప్పుడు వైసిపి లో ఉన్న ఫైర్ బ్రాండ్ రోజా ని కట్టడి చేయడానికి ఈమెని తీసుకొచ్చారేమోనన్న సందేహాలు కొంతమందికి ఉన్నాయి. అయితే వాణీ విశ్వనాథ్ మాత్రం రోజా మంచి నటి అని ప్రశంసించింది. కానీ పార్టీ ఆదేశిస్తే రోజా పై పోటీ కి సిద్దం అని ప్రకటించింది.తెలుగు ప్రజలు సినిమాల్లో ఆదరించినట్టుగానే తనని రాజకీయాల్లోనూ ఆదరించమని విఙ్ఞప్తి చేసింది.

స్వతహాగా మళయాళీ అయిన నలభై ఆరేళ్ళ ఈ నటి గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రజలతో పెద్దగా టచ్ లో లేరు. ఇటీవల వచ్చిన జయజానకినాయక లో చిన్న పాత్ర పోషించి రీ-ఎంట్రీ ఇచ్చారు. మరి ఎంతవరకు రాజకీయాల్లో, టిడిపిలో సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

కొసమెరుపు: వాణీ విశ్వనాథ్ తండ్రి పెద్ద జ్యోతిష్కుడు. వాణీ విశ్వనాథ్ 13 యేళ్ళ వయసులోనే ఆయన ఆమె గురించి జోస్యం చెప్పాడట – తాను సినీరంగం లో గొప్ప నటి అయి భవిష్యత్తు లో రాజకీయాల్లోకి కూడా వస్తుంది అని!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close