తెలుగులో ఇప్పుడు బిజీయెస్ట్ హీరో ఎవరో తెలుసా?

హైదరాబాద్: బిజీయెస్ట్ హీరో అంటే అగ్రహీరోలు పవన్, మహేష్, ఎన్‌టీఆర్, చరణ్, ప్రభాస్, అర్జున్ అయిఉండరని అందరికీ తెలిసిన విషయమే. వీరందరూ ఒకదాని తర్వాత మరొక చిత్రం చేస్తారని విదితమే. బీ గ్రేడ్ హీరోలలోకూడా ఇంతకుముందు నరేష్ బాగా బిజీగా ఉండేవాడు. అయితే పెళ్ళి అయిన తర్వాత ఏమయిందో, ఏమోగానీ స్పీడ్ తగ్గించాడు. ఈమధ్య బయట ఫంక్షన్‌లలోకూడా ఎక్కడా కనిపించటంలేదు. మరి ఈ బిజీయెస్ట్ హీరో ఎవరై ఉంటారో ఊహించారా. మరెవరో కాదు – ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వరసకు కొడుకయ్యే నారా రోహిత్.

నారా రోహిత్‌కు ప్రస్తుతం చేతిలో ఐదు సినిమాలు ఉండగా, తాజాగా మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. ‘శంకర’ ఇప్పటికే రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా, ‘మద్రాసి’, ‘పండగలా వచ్చాడు’, ‘సావిత్రి’, ‘అప్పట్లో ఒక్కడుండేవాడు’, చిత్రాలు సెట్‌లమీద ఉన్నాయి. మరోవైపు కొర్రపాటి సాయి నిర్మాణంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం, శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్ దర్శకత్వంలో మరో చిత్రం అంగీకరించాడు.

ఇప్పటివరకు నటించిన 7 సినిమాలలో బాణం, సోలో, ప్రతినిధి, రౌడీఫెలో, అసుర లాంటివి పెద్ద హిట్ కాకపోయినా రోహిత్‌కు మంచి ఇమేజ్, గుర్తింపును తీసుకొచ్చాయి. దీంతో చిన్న బడ్జెట్‌తో నిర్మించాలనుకునే వారికి అతను మంచి ఛాయిస్‌గా నిలుస్తున్నాడు. మంచి వాయిస్, రూపం ఉన్న రోహిత్‌ స్థాయి మరో మెట్టు ఎక్కాలంటే అతనికి ఇమ్మీడియెట్‌గా కావల్సింది – ఒక సూపర్ హిట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close