పాదయాత్ర తేదీపై ఆ మాత్రం ఆలోచించ‌లేదా..?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారని ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఏర్పాట్లు జ‌రిగిపోతున్నాయి, అన్న వ‌స్తున్నాడంటూ హ‌డావుడి మొద‌లుపెట్టారు, ఆయ‌న యాత్ర ఏ జిల్లాలోకి ప్ర‌వేశిస్తే.. ఆ జిల్లాలో వైకాపా నేత‌లు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలో ఖ‌రారు చేసేశార‌న్నారు, పాద‌యాత్ర జ‌రుగుతున్న ఈ ఆర్నెల్లూ అన్ని జిల్లాల్లోనూ నియోజ‌క వ‌ర్గాల్లోనూ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్ర‌మాలు ఉంటాయ‌న్నారు. ఇదంతా చూస్తుంటే ప‌క్కా వ్యూహంతోనే ఉన్నార‌ని అనిపిస్తుంది. కానీ, జ‌గ‌న్ పాద‌యాత్ర తేదీ విష‌య‌మై మొద‌ట్నుంచీ గంద‌ర‌గోళ ప‌రిస్థితే నెల‌కొంటూ వ‌చ్చింది. తేదీల‌ను ఎంచుకునే ముందు క‌నీస జాగ్ర‌త్త‌లు కూడా తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ముందేమో, అక్టోబ‌ర్ 27 నుంచి అని హ‌డావుడిగా ప్ర‌క‌టించేశారు. ఆరోజునే అన్న వ‌స్తున్నాడు అంటూ ఆర్భాటంగా చెప్పేశారు. స‌రిగ్గా, ఆ 27వ తేదీ శుక్ర‌వారం వ‌స్తోంద‌న్న సంగ‌తి తీరిగ్గా త‌రువాత చూసుకున్న‌ట్టున్నారు! తూచ్‌.. 27 కాదు, ఆరోజు గ్రహబలం బాలేదూ, ముహూర్త బలం సరిగా లేదంటూ ఏవో కారణాలు చెప్పారు. న‌వంబ‌ర్ 2 అంటూ కొత్త ముహూర్తం పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా మారిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. అన్న వచ్చేది 2 నుంచి కాదు.. న‌వంబ‌ర్ 6 అంటూ ఇప్పుడు వైకాపా నేత‌లు చెబుతున్నారు.

జ‌గ‌న్ పాద‌యాత్ర న‌వంబ‌ర్ 6 న ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ ప‌త్రిక‌లోనే క‌థ‌నం వ‌చ్చింది. ఇంత‌కీ.. 2 నుంచి తేదీ 6కి ఎందుకు మారిందంటే… రెండో తేదీ గురువారం వ‌స్తోంద‌ట‌. ఆ మార్నాడే, అంటే శుక్ర‌వార‌మే జ‌గ‌న్ కోర్టు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. భారీ ఎత్తున పాద‌యాత్ర ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున హ‌డావుడి చేసి.. ఆ మ‌ర్నాడే జ‌గ‌న్ కోర్టుకు వెళ్ల‌డం కోస‌మే యాత్ర‌కు బ్రేక్ ఇస్తే బాగోదు క‌దా! అలా కాకుండా, యాత్ర ప్రారంభించాక క‌నీసం ఓ మూడు రోజులైనా వ‌రుస‌గా జ‌నంలో జ‌గ‌న్ ఉంటేనే బాగుంటుంద‌నే ఉద్దేశంతో ఈ మార్పు చేయ‌బోతున్న‌ట్టుగా వైకాపా నేత‌లు చెబుతున్నారు. అందుకే, తేదీ విష‌యంలో ఈ స్వ‌ల్ప‌ మార్పు ఉంటుంద‌ని వివ‌రించుకొస్తున్నారు.

స‌రే… 2వ తేదీ గురువారం వ‌స్తుంద‌నీ, ఆ మర్నాడు వచ్చేది శుక్రవారం అనే విష‌యం నిన్న‌టి వ‌ర‌కూ తెలీదా..? విచార‌ణ‌కు వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు కుద‌ర‌ద‌నీ, ప్ర‌తీ శుక్ర‌వారం హాజ‌రు కావాల‌ని చెబితే త‌ప్ప‌… గురువారం త‌రువాత శుక్ర‌వారం వ‌స్తుందనేది అర్థం కాలేదా..? అంటే, కోర్టు మిన‌హాయింపు ఇచ్చేస్తుంద‌న్న అతి విశ్వాసంతోనే రెండో తేదీ పాద‌యాత్ర ప్రారంభానికి ముహూర్తం పెట్టుకున్న‌ట్టుగా అర్థం చేసుకోవాలి. ‘జ‌గ‌న్ పిటీష‌న్ ను కోర్టు కొట్టేస్తే ప‌రిస్థితి ఏంటి’.. అనే ప్రాథ‌మిక‌మైన ఆలోచ‌న కూడా లేకుండా పాద‌యాత్ర తేదీని ఖ‌రారు చేసేసిన‌ట్టుగా భావించాలి. వారానికోసారి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు బ్రేక్ రావ‌డం సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే… ప్రారంభ తేదీల విష‌యంలో ఇంత గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. తేదీల విష‌యంలో ఏమాత్రం ఆలోచించ‌కుండా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారూ అనే చ‌ర్చ పార్టీ కింది స్థాయి వర్గాలకు వేరే సంకేతాలు పంపే ఆస్కారం ఉంటుంది క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close