ఇంతకీ జగన్ రాజగురువును ఎందుకు కలిసారో?

జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం ఏమిటి? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. కానీ వారిద్దరి సమావేశం గురించి ఈనాడు, సాక్షి మీడియాలలో ఒక్క ముక్క కూడా వ్రాయలేదు. అసలు తను బద్దశత్రువయిన రామోజీరావుని కలవబోతున్నట్లు తన పార్టీ నేతలకి కూడా తెలియనివ్వలేదు. అలాగే తమ సమావేశం గురించి ఇంతవరకు జగన్ ఎవరి వద్ద నోరు విప్పలేదు. ఆవిధంగా గోప్యత పాటిస్తే సహజంగానే అందరిలో అనుమానాలు, రకరకాల ఆలోచనలు కలుగుతాయి. కానీ వాటి వలన అందరి కంటే ఎక్కువ నష్టం జరిగేది ఎవరికి? అని ఆలోచిస్తే మొదట రామోజీరావుకి తరువాత తెదేపాకి అని చెప్పక తప్పదు. కానీ జగన్ కి వైకాపాకి ఆ ఊహాగానాల వలన ఎటువంటి నష్టం జరుగక పోవచ్చును.

ఇక్కడ ఒక సందర్భోచితమయిన చిన్న కధ చెప్పుకొంటే పరిస్థితి మరింత బాగా అర్ధం చేసుకావచ్చును. ఒకానొకప్పుడు ఎంతో సఖ్యతగా ఉంటున్న అత్తాకోడళ్ళని చూసి ఓర్వలేని పొరుగింటి పుల్లమ్మ ఓ రోజు కోడలి దగ్గరకి వెళ్లి “బియ్యంలో వడ్లగింజలు చూసి ఏరమ్మా..” అని ఆమె చెవులో రహస్యంగా చెప్పి చక్కా వచ్చేసిందిట. అప్పుడు అత్తగారు కోడలిని పిలిచి ఆవిడ నీ చెవిలో అంత రహస్యంగా ఏమి చెప్పిందని అడిగితే కోడలు ఆ..ఏమీ లేదు..బియ్యంలో వడ్ల గింజల గురించి చెప్పింది అందిట. అప్పటి నుండి ఆ అత్తకోడళ్ళ మధ్య అనుమానాలు, విభేదాలు మొదలయ్యాయిట.

బహుశః జగన్ కూడా అదే ప్రయోగం రామోజీ మీద చేసాడేమో? ఇదివరకు వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లలో సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ బొమ్మలు ప్రచురించి జూ.ఎన్టీఆర్ కి తెదేపాకి మధ్య చిచ్చుపెట్టి వారి మధ్య అనుమానాలు కలిగించి వారిని శాస్వితంగా దూరం చేయగలిగింది. బహుశః ఇప్పుడు అదే వ్యూహంతో జగన్ రామోజీని కలిసి ఉండవచ్చును. రామోజీ క్రమంగా తెదేపాకు దూరం అవుతున్నారని అందుకే ఇసుక మాఫియా గురించి ఈనాడులో బ్యానర్ ఐటమ్స్ వేశారని కొందరు విశ్లేషించి వ్రాసారు. అటువంటి వార్తలు తెదేపాలో అనుమాన బీజాలు నాటవచ్చును.

ఒకవేళ రామోజీపై తెదేపాకు అనుమానం కలిగించి వారి మధ్య చిచ్చుపెట్టగలిగితే మొదట తెదేపా, తరువాత రామోజీ ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. కానీ జగన్ వేసిన ఈ ఎత్తులను రామోజీ గ్రహించలేరనుకొంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. అలాగే అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎత్తులను చాలా తేలికగానే అర్ధం చేసుకోగలరు. కానీ తమ సమావేశం గురించి జగన్ పాటిస్తున్న గోప్యత వలన, మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాల వలన తెదేపా నేతల్లో అనుమాన బీజాలు ఇప్పటికే పడిఉంటాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత మాత్రం రామోజీరావుదే లేకుంటే జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకోవడం తధ్యం.

జగన్, రామోజీ దగ్గరవుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం పద్దారు. కానీ రెండు పూర్తి విభిన్నమయిన రాజకీయ పార్టీలకి, మీడియాలకి, కులాలకి చెందిన రామోజీరావు, జగన్మోహన్ రెడ్డిలు కలిసి పనిచేయడం అసంభవమని చెప్పవచ్చును. ఒకవేళ తాత్కాలికంగా వారు ఏదో ఒక కారణంగా చేతులు కలిపినా పైన పేర్కొన్న మూడింటి వలన వారు మళ్ళీ వెంటనే విడిపోక తప్పదు. అప్పుడు ఇద్దరూ చాలా నష్టపోవచ్చును. మళ్ళీ వారిలో రామోజీయే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. తనది ఒక కన్ను పోయినా పరువాలేదు ఎదుట వాడివి రెండు కళ్ళుపోవాలని జగన్ అనుకొంటే రామోజీతో స్నేహానికే మొగ్గు చూపవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close