నాలుగు గంటలు ఆలస్యంగా జగన్ దీక్ష ప్రారంభం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు నగర శివార్లలోని నల్లపాడువద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవ్వాల్సిన ఈ దీక్ష పదిగంటలు ఆలస్యంగా మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ప్రారంభమయింది.

ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌నుంచి విజయవాడకు జగన్ విమానంలో బయలుదేరాల్సి ఉండగా, ఆయన విమానాశ్రయానికి ఆలస్యంగా వెళ్ళటంతో ఫ్లైట్ అందుకోలేకపోయారు. దానితో ఆయన రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. 12 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్న జగన్ కనకదుర్గ ఆలయానికి వెళ్ళారు. అమ్మవారిని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. అక్కడనుంచి గుంటూరు దీక్షాస్థలికి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటలకు దీక్షాస్థలికి చేరుకున్నారు. భారీ జనసందోహంతో కిక్కిరిసిపోయిన సభాప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేకహోదాకోసం ఇప్పటికే ప్రాణాలర్పించిన వారి ఫోటోలకుకూడా పూలమాలలు వేసి ప్రజలకు అభివాదం చేశారు. మధ్యాహ్నం 2.25 గంటలకు దీక్ష ప్రారంభించారు.

పార్టీనేతలు కొందరు మాట్లాడిన తర్వాత జగన్ సభకు విచ్చేసినవారినుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేకహోదా వస్తే మన పిల్లలకు ఉద్యోగాలొస్తాయని, అందుకోసం ఎంతవరకైనా పోరాడటానికి తాను సిద్ధమని చెప్పారు. బాబు, కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో కుమ్మక్కై తనపై కేసులు పెట్టారని, అయినా తాను దేవుడిని నమ్ముకున్నానని అయితే ఓటుకు నోటు కేసులో పట్టుబడిన బాబుమాత్రం ఆ కేసుకోసం ప్రధానమంత్రి మోడి కాళ్ళు పట్టుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా మోసం, మోసం, మోసం అని అరిచారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని, బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు చెప్పారని, కానీ అవేమీ జరగలేదని జగన్ ఆరోపించారు. ఈ పాలనకు చరమగీతం పలికే రోజులు రావాలన్నారు. ఈ పాలన బంగాళాఖాతంలో కలిసే రోజొస్తుందని చెప్పారు. అందరూ కలిసి పోరాడితే చంద్రబాబే కాదు, ఆయన నాయన మనసుకూడా మారుతందని జగన్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close