అవినీతి కేసులో బుక్ అయిన కేసీఆర్?

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఒక సంచలన వార్త వెలుగులోకొచ్చింది. 2006లో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఒక కాంట్రాక్ట్‌లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై సీబీఐ అధికారులు నిన్న కేసీఆర్‌ను ప్రశ్నించారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించే పనుల కాంట్రాక్ట్‌ను, సాధారణంగా ఆ పనులు చేసే కేంద్ర సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌(ఎన్‌బీసీసీ)కి కాకుండా నాటి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌‍కు ఇచ్చారు. ఆ సంస్థ నిర్మించిన భవనాలు నాసిరకంగా ఉండటంతో ఈఎస్ఐ సంస్థ 2007-08లో దర్యాప్తుకు ఆదేశించింది. ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ నిర్మాణం వలన కనీసం రు.5 కోట్లు నష్టం వాటిల్లిందని ఐఐటీ నిపుణులు రూపొందించిన నివేదికలో తేలింది. వారి దర్యాప్తులో తేలిన ప్రాధమిక సమాచారం ఆధారంగా సీబీఐ వారి యాంటీ కరప్షన్ విభాగం 2011 సంవత్సరంలో కేసును నమోదు చేసి క్షుణ్ణమైన దర్యాప్తుకు దిగింది.

అసలే ప్రతిపక్షాలనుంచి ఎడాపెడా విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్‌కు ఇది చెడువార్తే. ప్రతిపక్ష నాయకులు మాత్రం పండగ చేసుకుంటారు. తమకు దొరికిన బలమైన ఈ ఆయుధంతో కేసీఆర్‌పై చెలరేగిపోనున్నారు.

ఈ సందర్భంగా మరో విషయాన్ని చెప్పుకోవాలి. కేసీఆర్ అక్రమంగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్ట్ గత ఏడాది ఏప్రిల్‌లో సీబీఐ ఎస్‌పీని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన బాలాజీ వదేరా అనే వ్యక్తి చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా కోర్ట్ కేసీఆర్‌, ఆయన మేనల్లుడు హరీష్ రావు, విజయశాంతిలపైకూడా దర్యాప్తు జరపాలంటూ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే సాంకేతిక కారణాలరీత్యా ఈ కేసు ముందుకు వెళ్ళలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close