శంఖుస్థాపనకి పిలిచినా పవన్ డుమ్మా..పిలవక పోయినా ఎన్టీఆర్ హాజరు?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ న్ని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి మంత్రులు స్వయంగా వెళ్లి ఆహ్వానించినా ఆయన తన సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కోసం గుజరాత్ వెళ్ళిపోయారు. కనుక ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు లేవనే భావించవచ్చును. ఆయన రాజకీయాలలోకి రాకుండా లేదా రాజకీయాలు మాట్లాడకుండా కేవలం సినిమాలు చేసుకొంటున్నట్లయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా ఎవరూ ఏమీ అనుకొనేవారు కారు. కానీ జనసేన పార్టీతో రాజకీయాలలోకి ప్రవేశించి, అడపాదడపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ హడావుడి చేస్తున్నప్పుడు ఈ కార్యక్రమానికి రాకపోయినట్లయితే ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలలాగే ప్రజల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పదు.

ఇక మరో విచారకరమయిన విషయం ఏమిటంటే, జూ. ఎన్టీఆర్ ని ఈ కార్యక్రమానికి ఎవరూ ఆహ్వానించలేదని సమాచారం. తెదేపాకు ఆయనకు మధ్య దూరం పెరిగి ఉండవచ్చును. కానీ ఒకప్పుడు అదే జూ.ఎన్టీఆర్ తెదేపా విజయం కోసం ఎన్నికలలో ఎంతగా కష్టపడ్డారో జ్ఞప్తికి తెచ్చుకొన్నట్లయితే, ఆయనకు ఆహ్వానం పంపకపోయుంటే అది సబబు కాదు. ఆహ్వానించకపోయినా ఈ కార్యక్రమానికి హాజరవుదామని జూ.ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ న్ని వెళ్లి ఆహ్వానించినా వచ్చేలా లేరు. జూ.ఎన్టీఆర్ ని పిలవక పోయినా రావాలనుకొంటున్నట్లు సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close