చరిత్రాత్మక ఘట్టం: అమరావతికి శంకుస్థాపన చేసిన నరేంద్ర మోడి

హైదరాబాద్: ఎన్నోరోజులుగా అత్యంత ఆసక్తిని రేకెత్తింకించిన చరిత్రాత్మక, ప్రతిష్ఠాత్మక ఘట్టం పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోతున్న నూతన రాజధాని అమరావతికి ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇవాళ శంకుస్థాపన చేశారు.

ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంనుంచి మోడి దిగారు. గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడికి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడనుంచి ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక హెలికాప్టర్‌లో శంకుస్థాపన ప్రాంగణానికి బయలు దేరారు. 12.20 గంటలకు వీవీఐపీ హెలిప్యాడ్‌పై ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. యాగశాలలోకి వెళ్ళేముందు అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి 3డీ ప్లాన్‌ను సందర్శించారు. ప్రవేశద్వారంలో నిలుచుని ఉన్న చంద్రబాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్‌లను పలకరించారు. దేవాంశ్‌తో కొద్దిసేపు ముద్దులాడారు. చంద్రబాబు అమరావతి 3డీ ప్లాన్ ద్వారా రాజధాని విశేషాలను వివరించారు.

12.30 గంటలకు మోడి యాగశాలలోకి ప్రవేశించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలమధ్య హోమగుండంలో పూర్ణాహుతిని సమర్పించారు. నవధాన్యాలు, యాగద్రవ్యాలను వదిలారు. చంద్రబాబుతోపాటు నరసింహన్, కేసీఆర్, వెంకయ్య నాయుడుకూడా నవధాన్యాలను హోమగుండంలో వేశారు. తర్వాత వేద పండితులు వారందరినీ ఆశీర్వదించారు. అక్కడనుంచి బయటకొచ్చిన మోడి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడనుంచి మోడి, తదితరులు బహిరంగసభ వేదికపైకి వెళ్ళారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close