కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్న ప్రీతి జింటా

హైదరాబాద్: సొట్టబుగ్గల బాలీవుడ్ బ్యూటీ, పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో డిన్నర్ డేట్‌కు వెళుతూ మీడియా కంటపడింది. ఆ బాయ్‌ఫ్రెండ్ మరెవరో కాదు… సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్. తన జీవితంలోకి ఓ కొత్త స్పెషల్ పర్సన్ రాబోతున్నాడంటూ ప్రీతి ఇటీవల ట్వీట్ చేసింది. భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య ఐదో వన్డే మొన్న ముంబాయిలో జరిగిన రోజు – ఆదివారం రాత్రి వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్ బయట మీడియాకు కనిపించారు. మీడియాకు ఏ మాత్రం జంకకుండా ప్రీతి పోజులివ్వటం విశేషం.

40 ఏళ్ళ ప్రీతి బాంబే డైయింగ్ సంస్థ అధినేత వారసుడు నెస్ వాడియాతో చాలాకాలం సహజీవనం చేసింది. పంజాబ్ కింగ్స్‌ జట్టుకు ఇద్దరూ యజమానులే. అయితే తర్వాతి కాలంలో వీరిద్దరికీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు రావటం, నెస్ తనను కొట్టాడని ప్రీతి కేసు పెట్టటంకూడా జరిగింది. అలా వాళ్ళిద్దరూ విడిపోయారు. తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు బ్రెట్ లీతో ప్రీతి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని కొన్ని వార్తలొచ్చాయి. అయితే తాజా బాయ్ ఫ్రెండ్ మాత్రం నిజమేనని నిర్ధారణ అయింది. ఇక డేవిడ్ మిల్లర్ పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడు. ఐపీఎల్-6 సీజన్‌లో బెంగళూరుపై 38 బంతుల్లో సుడిగాలి సెంచరీ చేసి కిల్లర్ మిల్లర్‌గా పేరుతెచ్చుకున్నాడు. కొసమెరుపేమిటంటే ప్రీతికి 40 ఏళ్ళయితే, మిల్లర్‌కు 26 ఏళ్ళు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close