జబర్దస్త్ షోలో కొత్త యాంకర్..!

ఈ టివిలో టెలిలికాస్ట్ అయ్యే జబర్దస్త్ షో మంచి పాపులారిటీని సంపాధించింది. ప్రోగ్రాంలో కాస్త అడల్ట్ కంటెంట్ ఎక్కువ అనిపించినా బుల్లితెర ప్రేక్షకులను గంట పాటు ఎంటర్టైన్ చేస్తూ మంచి టి.ఆర్.పి రేటింగ్లో ఉంది జబర్దస్త్ షో. అయితే బుల్లితెరలో సెన్షేషన్ అయిన ఈ షోలో ఇప్పుడు కొత్త వారితో అలరించేందుకు రెడీ అయ్యిందట. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యాంకర్ రష్మి కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంటుందని వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ షోలో యాంకర్ అంటే సెపరేట్ క్రేజ్ ముందు ఈ క్రేజ్ ని తీసుకువచ్చింది హాట్ యాంకర్ అనసూయ.

తన క్యూట్ మాటల్తో హాట్ యాంకర్ గా అవతరించిన అనసూయ జబర్దస్త్ షోతోనే మంచి పాపులారిటీని సంపాధించింది. అ ప్రోగ్రాంలో యాంకర్స్ వేసే కాస్టూమ్స్ కే బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే అనసూయ తర్వాత ఆ ప్రస్థానాన్ని కొనసాగించింది రష్మి. అంతకుముందు చిన్న చితకా సినిమాలు చేసినా లాభం లేక యాంకర్ అయిన ఈ భామ జబర్దస్త్ షోతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పేరుకి కామెడి షో అయినా స్టేజ్ మీద కామెడీ స్కిట్స్, హాట్ యాంకర్ల స్కిన్ షోతో ప్రోగ్రాం మాత్రం సూపర్ సక్సెస్ తో ముందుకెళ్తుంది.

అయితే రానున్న రోజుల్లో రష్మి కూడా తప్పుకుని యాంకర్ గా వేరే అమ్మాయిని పెట్టే ఆలోచనలో ఉన్నారట మల్లెమాల టీం. రష్మి ప్రస్తుతం హీరోయిన్ గా రెండు మూడు సినిమాలకు ఓకే అయ్యింది. సినిమాలు, రియాలిటీ షోలు అంటే కష్టం కనుక ఇక జబర్దస్త్ కు గుడ్ బై చెప్పబోతుందని అంటున్నారు. ఇక ఆమె ప్లేస్ లో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న యాంకర్ శ్యామలని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. శ్యామల కూడా తన క్యూట్ యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమాల్లో కూడా చిన్న పాత్రలు వేస్తూ వస్తున్న ఈ భామ జబర్దస్త్ షో యాంకర్ అయితే సూపర్ క్రేజ్ సంపాధించినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close