చిత్తూరు మేయర్ భర్త కూడా మృతి

చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిన్న చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ పై కొందరు దుండగులు జరిపిన దాడిలో అనురాధ మరణించగా ఆమె భర్త మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను తక్షణమే తమిళనాడులోని వేలూరులోని సి.ఎం.సి.ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ ఆయన కూడా నిన్న రాత్రి మరణించారు. ఆ దంపతులపై దాడి చేసిన దుండగులు అనురాధను అతి సమీపం నుండి తుపాకితో కాల్చి చంపారు. మోహన్ పై కత్తులతో దాడులు చేసారు. వారి దాడిలో ఆయన మెడ నరాలు తెగిపోయాయని సమాచారం. వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతనిని కాపాడలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close