బాబునే కాదు, కేసీఆర్‌నూ బంగాళాఖాతంలో పడేయాలంటున్న జగన్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే – ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును బంగాళాఖాతంలో పడేయాలని అంటుండటం ఆ రాష్ట్ర ప్రజలందరకూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్నికూడా బంగాళాఖాతంలో పడేయమని పిలుపునిస్తున్నారు. వరంగల్ ఉపఎన్నిక సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరపున ప్రచారం చేసిన జగన్, ఇవాళ స్టేషన్ ఘనపూర్ రోడ్‌షోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. వరంగల్ ఉపఎన్నిక ఎందుకు తీసుకొచ్చారో కేసీఆర్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 150మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలకు కారణమెవరో నిలదీయాలన్నారు. 18 నెలల్లో ఎన్ని ఇళ్ళు కట్టించారో కేసీఆర్‌ను అడగాలని సూచించారు. దివంగత వైఎస్ఆర్ ఐదేళ్ళలో 48 లక్షల ఇళ్ళు కట్టించి ఇచ్చారని, కేసీఆర్ ఇప్పటివరకు 396 ఇళ్ళు మాత్రమే కట్టించారని చెప్పారు. ప్రతి దళితుడికీ 3 ఎకరాల భూమి ఇస్తానన్న ముఖ్యమంత్రి కేవలం 1600 ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. తమ పార్టీకి మాత్రమే ఓట్లు అడిగే హక్కు ఉందని చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close