ఉగ్రవాదుల చెరలో 20మంది భారతీయులు

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశ రాజధాని బమాకో నగరంలో శుక్రవారం ఉదయం రెడిసన్ బ్లూ అనే స్టార్ హోటల్లో కొందరు ఉగ్రవాదులు మారణాయుధాలతో జొరబడి ఆ హోటల్లో ఉన్న సుమారు 170 మందిని తమ అధీనంలోకి తీసుకొన్నారు. వారిలో ఖురాన్ చదవగలిగిన ఏడుగురిని విడిచిపెట్టారు. బందీలుగా పట్టుకొన్న వారిలో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు సమాచారం. హోటల్ కి వచ్చిన అతిధులతో బాటు, ఆ హోటల్లో పనిచేస్తున్న 40మంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 20మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ దృవీకరించింది. వారందరూ దుబాయికి చెందిన ఒక ప్రముఖ సంస్థ తరపున ఆ హోటల్లో గత కొంత కాలంగా పనిచేస్తున్నారు.విదేశాంగ శాఖ అధికారులు మాలీ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు హోటల్లో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకొన్న భారతీయులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు తాజా సమాచారం.

ఆ హోటల్లోకి ఇద్దరు ఉగ్రవాదులే జొరబడినట్లు మొదట భావించినప్పటికీ, కనీసం 5-10 మంది ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించగా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్ చుట్టూ భద్రతాదళాలు మొహరించి లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు హోటల్ యొక్క ఏడవ అంతస్తులో అన్ని వైపులా కలియ తిరుగుతూ భద్రతాదళాలు లోపలకి ప్రవేశించకుండా పైనుండి వారిపై హ్యాండ్ గ్రెండ్స్ విసురుతూ, తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటం ఇంకా ఎప్పటికి ముగుస్తుందో దానిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close