అసహనంపై అమీర్ ఖాన్ : మా ఆవిడ భయపడుతోంది

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కూడా గత కొద్దినెలలుగా దేశంలో సమన్యాయం లోపించినట్లు, సహనశీలత కనుమరుగైపోయినట్లు అనిపిస్తున్నదట. దేశ ప్రజల్లో ఒకనిగా ఉన్న తనకు అభద్రతాభావం రోజురోజుకీ పెరిగిపోతున్నదని చెబుతున్నాడీ బాలీవుడ్ స్టార్. అంతేకాదు, ఆయన భార్య కిరణ్ రావ్ కూడా అలాగే భయపడిపోతున్నదనీ, పరిస్థితులు చూస్తుంటే దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చేలా ఉన్నదని తనతో ఆమె అన్నదని అమీర్ ఖాన్ అంటున్నారు.

అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో కొంతలోకొంత చప్పబడిన `అసహనం’ వ్యవహారం మళ్ళీ ముదిరేసూచనలు కనబడుతున్నాయి. రాంనాథ్ గోయింకా జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ అమీర్ ఖాన్, దేశంలో అసహనం పెరిగిపోయిందని తానుకూడా నమ్ముతున్నానని చెప్పారు.

`ఒక వ్యక్తిగా, దేశ పౌరునిగా నిత్యం న్యూస్ పేపర్లు చదువుతున్నప్పుడు, దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటున్నప్పుడు అసమానత, అసహనం పెరిగిపోతున్నట్లుగానే అనిపిస్తున్నది. జరుగుతున్న సంఘటనలు అలా ఉన్నాయి. వాటిని త్రోసిపుచ్చలేము’ అని వివరణ ఇచ్చారు.

అంతేకాదు, ఒక సందర్బంలో తన భార్య కిరణ్ తో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో కూడా ఇలాంటి భయం తొంగిచూసిందని అంటున్నారు అమీర్ ఖాన్. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటే, ఇక్కడ ఉండటంకంటే, ఏదైనా దేశానికి వెళితే బాగుంటుందేమోనని ఆమె సలహా కూడా ఇచ్చిందని అంటున్నాడీ బాలీవుడ్ స్టార్.

ఏ సమాజంలోనైనా ప్రజలకు భద్రత ఉండాలి, అలాగే, సమన్యాయం కనిపించాలి. ఆ రెండూ లోపిస్తే ఆ దేశంలో సహనశీలత లోపించినట్లేనని అమీర్ ఖాన్ భావిస్తున్నారు. దేశంలో అసహనం పెరిగిపోయినట్లు భావించి మేధావులు తమ అవార్డులను తిరిగిఇచ్చేయడాన్ని అమీర్ ఖాన్ సమర్థించారు. దీన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరనీ, నిరసనను తెలియజేసే ఒక మార్గంగానే దీన్ని భావించాలని అమీర్ అంటున్నారు. సామాజిక వ్యవస్థమీద అవగాహన ఉన్న అమీర్ ఖాన్ మరి దేశాన్ని సరైన మార్గంలోకి తిప్పకుండా, అలా భార్యా పిల్లలతో వేరేదేశానికి టపా కట్టేయాలనుకోవడమేమిటో…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close