డిపాజిట్ గల్లంతుపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్

హైదరాబాద్: వరంగల్ ఉపఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత దారుణంగా, డిపాజిట్ కోల్పోయేటంత స్థాయిలో ఓడిపోతామని ఆ పార్టీ నేతలు ఎవరూ ఊహించలేదు. ఓటమి షాక్ నుంచి ఒకరొకరుగా తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు బయటకొచ్చి ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఓటర్లు భయంతోనే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చెప్పారు. ఓటువేయకపోతే సంక్షేమ పథకాలను ఆగిపోతాయని టీఆర్ఎస్ నేతలు బెదిరించారని అన్నారు. ప్రశ్నించిన వారిని జైళ్ళలో పెడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని చెప్పారు. వరంగల్ విజయంతో ప్రజలు తమవైపే ఉన్నారని తేలిందంటున్న కేసీఆర్, టీఆర్ఎస్‌లోకి పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. తమ సవాల్‌ను కేసీఆర్ స్వీకరిస్తారనే భావిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు వరంగల్ ఫలితంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రచారాన్ని వరంగల్ ప్రజలు నమ్మలేదని అన్నారు. ఓటమికి సమష్ఠి బాధ్యత వహిస్తామని చెప్పారు. ఓటమిని విశ్లేషించుకుని ముందుకు వెళతామని అన్నారు. 2019లో ఎలాంటి రాజకీయ పొత్తులైనా ఉండొచ్చని, వాటిని గురించి ఇప్పుడే మాట్లాడటం అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ క్యాడర్ ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మెచ్చేవిధంగా పనిచేయాలని కోరారు. వరంగల్ ప్రచారంలో టీఆర్ఎస్‌కు తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, మూడేళ్ళలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతాంగానికి నీళ్ళిస్తే టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తానని జానారెడ్డి అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close