దేశంలో ఉండమని మోదీకి చెప్పండర్రా…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ముహూర్తంలో పదవీబాధ్యతలు స్వీకరించారోగానీ, కాళ్లకు చక్రాలు కట్టుకుని ఒకదేశం తర్వాత మరో దేశం తిరుగుతూనే ఉన్నారు. 2014 నుంచి మోదీ ఇప్పటివరకు (నంవబర్ వరకు) 36సార్లు విదేశీ పర్యటనల్లో పాల్గొన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయగానే విదేశీ టూర్లు మొదలుపెట్టారు. 2014లో తొమ్మిది విదేశీపర్యటనలు తనఖాతాలో జమచేసుకున్న మోదీ, 2015లో ఇప్పటికే 24 సార్లు విదేశీ విమానాలు ఎక్కేశారు. ఇంకా ఈఏడాదిలో మరో రెండు విదేశీ పర్యటనలు బాకీ ఉన్నాయి.

దేశంలో ఎన్నో కీలకమైన సమస్యలుండగా ప్రధాని మోదీ ఒకదానివెంట మరొకటిగా విదేశీ పర్యటనలకు వెళ్లడం విమర్శలకు దారితీస్తోంది. 2014లో మోదీ ఎన్నికల్లో గెలిచారా? లేక విదేశీ టూర్ ప్యాకేజీ పోటీలో గెలిచారా? అన్న సందేహం కలగకమానదు. దేశంలో అసహనం పెరిగిపోతున్నా, కందిపప్పు ధర 200 రూపాయలకు చేరుకుంటున్నా, సామాన్య జనజీవితం అస్తవ్యస్థమవుతున్నా ఘనమైన మోదీగారికి పట్టడంలేదు. ఆయనగారు భారతదేశపు 125కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి అనుకోవడంలేదు. ఇండియాని ఓ కంపెనీగా భావిస్తూ దానికి సీఈఓగా అనుకుంటున్నారు. ఫక్తు వ్యాపారలావాదేవీలతో గుజరాతీ వ్యాపారీగా సాగిపోతున్నారు.

ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళడం తప్పుకాదు. గతంలో కూడా ప్రధానమంత్రిగాఉన్నవారు విదేశీపర్యటనలకు వెళ్ళారు. అయితే, అంతర్జాతీయ కూటమి సమావేశాల్లో (బ్రిక్స్, జి-20, ఈఏఎస్, ఎస్ సీఓ, ఐబీఎస్ ఏ, సార్క్ వంటి సమావేశాల్లో) పాల్గొనడానికి వెళ్లడం మంచిదే. అక్కడ భారతవాణి ప్రపంచదేశాలకు వినిపించడం అనివార్యమే. దీన్ని ఎవ్వరూ తప్పుబట్టలేరు. అయితే మోదీ వెళుతున్న విదేశీ పర్యటనల్లోని ప్రధాన లక్ష్యం ఆయా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంగానే ఉంది. ఇది కూడా అవసరమైనదే. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఆర్థికంగా ఆదుకునే అవకాశాలను అన్వేషించడం అవసరమైనదే. కాకపోతే గతంలో ఇలాంటి విదేశీ పర్యటనలను విదేశాంగ శాఖ మంత్రి గానీ, లేదా ఆర్థికశాఖమంత్రిగానీ తరుచుగా వెళుతుండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. ప్రతిచోటుకీ ప్రధాని మోదీనే స్వయంగా వెళ్ళివస్తున్నారు. కొన్ని దేశాలకైతే ప్రధాని రెండుసార్లు ఇప్పటికే వెళ్ళివచ్చారు. 2014లో ఆయనగారి పర్యటనల జాబితా చూస్తే, నేపాల్ కు రెండుసార్లు వెళ్లారు. ఆగస్టులో ఒకసారి, నవంబర్ లో మరోసారి మోదీ నేపాల్ వెళ్ళివచ్చారు. ఇక అమెరికాకు 2014లో ఒకసారి, 2015లో మరోసారి వెళ్ళివచ్చారు. సింగపూర్ లో కూడా 2015 మార్చిలోనూ, తిరిగి నవంబర్ లోనూ పర్యటించారు. ఇప్పటికే ఆయనగారు చేసిన విదేశీ పర్యటనలతో వరల్డ్ మ్యాప్ తయారుచేసి చూస్తే, ఆయనగారి విశ్వరూపం ఏ స్థాయిలో ఉన్నదో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.

దేశాన్ని ఆర్థికంగా సంపన్నం చేయడంకోసం ప్రధాని మోదీ బాగానే కష్టపడుతున్నారు. ఈ రకంగా ఆయన రికార్డు కూడా సృష్టిస్తున్నారు. త్వరలోనే 50 విదేశీ పర్యటనలను పూర్తిచేసుకోబోతున్నారు. ఇదంతా బాగానేఉంది. కానీ దేశంలో ప్రజల అవసరాల గురించి పట్టించుకోకుండా, విదేశాలు పట్టుకుతిరిగుతుంటే ఎలా? విదేశీరంగుల కలలో విహరిస్తున్న మోదీని ఎవరు నేలమీదకు దింపేది? ప్రధాని మోదీ పారదర్శక పాలన అందిస్తున్నారన్నది నిజమే. ఆల్ ఇండియా రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనడమేకాదు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన http://pmindia.gov.in అనే వెబ్ సైట్ ని ఏర్పాటుచేసుకుని, అందులో ఇంటరాక్ట్ విత్ పీఎం అనే ఆప్షన్ ఉంచారు. http://pmindia.gov.in/en/interact-with-honble-pm ద్వారా ఎవరైనా ఎంటరై వారి అభిప్రాయాలను ఆలోచనలను షేర్ చేయవచ్చు.

మోదీకి కొన్ని సూచనలు

అయ్యా, మోదీగారు, మీరు విదేశీ పర్యటనలను తగ్గించుకుని దేశప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండాలి.

ఇలాగే ఎక్కవకాలం విదేశీయాత్రలతో గడపాలనే మీరు కచ్చితంగా నిర్ణయించుకునే పక్షంలో దేశంలోని ప్రజల సమస్యలు పట్టించుకునేందుకు ఉప-ప్రధానమంత్రిని నియమించండి.

అలా నియమించే ఉప ప్రధానమంత్రి కేవలం తోలుబొమ్మలా కాకుండా మీ బదులుగా కీలకనిర్ణయాలు తీసుకునే అధికారం ఇవ్వాలి.

ఇండియాను మార్కెట్ చేయడంలో మీకుమీరేసాటి. కాకపోతే ఎక్కడోఅక్కడ ఫుల్ స్టాప్ పెట్టి పేపర్ ప్రాజెక్టులను నిజం చేయడానికి నడుం బిగించాలి.

మీపట్ల ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం సడలకుండా చూసుకోండి. ప్రతి విషయంలోనూ మీ ప్రమేయం ఉండాలనుకోవడం మంచిదికాదు. ఏకవ్యక్తి పాలనక్రింద ఈ దేశం ఉన్నదన్న భావనను కలిగించకండి.

ఆలోచనలు మంచివికావచ్చు, ఆచరణలో చిత్తశుద్ధి ఉండవచ్చు. కానీ 125కోట్ల ప్రజల మనోభావాలు గుర్తెరిగి ప్రవర్తించండి. లేకపోతే 2019 ఎన్నికల్లో మీరు మీ జట్టు బోల్తాకొట్టడం ఖాయం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close