ఇక ఆధార్ అవసరం లేదు

రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిరావడం మన దేశంలో సర్వసాధారణమయిన విషయమే. లైన్లో నిలబడ్డవారు కౌంటర్ వద్దకు చేరుకొనేలోగా తాము కోరుకొన్న తేదీకి టికెట్లు దొరుకుతాయో లేదో అనే ఆందోళనతో ఉంటారు. చివరికి కౌంటర్ వద్దకు చేరుకొని ‘హమ్మయ్య!’ అని ఊపిరి తీసుకొని టికెట్ కోసం అడిగితే అవతలి వైపు నుండి ‘ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవ్వండి,’ అని బుకింగ్ క్లర్క్ అడగగానే గతుక్కుమంటారు. ఎందుకంటే నేటికీ చాలా మందికి సామాన్య ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. ఒకవేళ ఉన్నా రిజర్వేషన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, దాని జిరాక్స్ ఉండాలని తెలియకపోవడమే కారణం. టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడానికి తమ పనులన్నీ మానుకొని ఎంతో దూరం నుండి వచ్చి తెల్లవారుజాము నుండే రిజర్వేషన్ కౌంటర్ దగ్గిర పడికాపులు కాసేక ఈ చేదు అనుభవం ఎదురయినప్పుడు రైల్వేవాళ్ళని తిట్టుకొంటూ వెళ్లిపోతుంటారు. చాలా మందికి ఎప్పుడో అప్పుడు ఎదురయిన అనుభవమే ఇది.
అదేవిధంగా ఆన్ లైన్లో ఒక్కరోజు ముందుగా తత్కాల్ రిజర్వేషన్ చేసుకొనే వాళ్లకు తరచూ ఇటువంటి చేదు అనుభవమే ఎదురవుతుంటుంది. ఎందుకంటే కేవలం ఒక్క గంట సేపు మాత్రమే పనిచేసే తత్కాల్ బుకింగ్ సమయంలో ఆన్ లైన్లో రిజర్వేషన్ చేసుకొనేముందు అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు లేదా వేరే గుర్తింపు కార్డుల నెంబర్లను విధిగా కాలమ్స్ లో నింపలసి ఉంటుంది. కానీ ఒక పక్క క్షణక్షణానికి టికెట్స్ అయిపోతుంటే, అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు నింపడానికే పుణ్యకాలం కాస్తా సరిపోతుంది. ఒకవేళ ఏ ఒక్కరి నెంబరు అందుబాటులో లేకపోయినా ఇక అంతే సంగతులు!
ఈ సమస్యను గుర్తించిన రైల్వేశాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ ఆధార్ కార్డు, కాపీ నెంబరు నిబంధనని తొలగించబోతోంది. కనుక ఎటువంటి గుర్తింపు కార్డు, నెంబరు లేకుండానే ప్రయాణికులు తమ టికెట్స్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్స్ దగ్గర మరియు ఆన్ లైన్లో కూడా బుక్ చేసుకోవవచ్చును. కానీ ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం విధిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి. టికెట్ కండెక్టర్ అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది.
రైల్వే శాఖ త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకే నెంబర్:1512 తో హెల్ప్ లైన్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. దేశంలో ఎక్కడి నుండయినా ప్రయాణికులు ఈ నెంబర్ కి ఫోన్ చేసి తమ పిర్యాదులను నమోదు చేసుకోవచ్చును. దీని కోసం రైల్వేశాఖ దేశ వ్యాప్తంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేయబోతోంది. అక్కడ ప్రయాణికుల పిర్యాదులను నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు, విభాగాలకు తక్షణమే పంపించబడుతాయి. ప్రయాణాలలో డబ్బు లేదా తమ వస్తువులను పోగొట్టుకొన్నవారు ఈ నెంబర్ కి పిర్యాదు చేసి తమ ప్రయాణం ఆపకుండా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ బోగీలో ఏదయినా సమస్య ఎదుర్కొంటుంటే వారు కూడా ఈ నెంబర్ కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close