బీజేపీలోకి ఆదినారాయణరెడ్డి ..?

కడప జిల్లా టీడీపీకి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు.. ఆదివారం సీక్రెట్‌గా హైదరాబాద్‌లో.. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ నడ్డాను కలిశారు. ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ నేత ఆయనను.. నడ్డా వద్దకు తీసుకెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో… నడ్డా.. ఆదినారాయణరెడ్డిని.. బీజేపీలోకి ఆహ్వానించారని.. ఆయన సమయం తీసుకుని.. నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీలో చేరే ఉద్దేశమే లేకపోతే.. ఆదినారాయణరెడ్డి నడ్డా వద్దకు వెళ్లే వారు కాదనే అంచనాలున్నాయి.

కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో.. ఆదినారాయణరెడ్డి బలమైన నేతగా ఉన్నారు. అక్కడ పార్టీల కన్నా.. వర్గాలకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఓ వైపు ఆదినారాయణరెడ్డి, మరో వైపు రామసుబ్బారెడ్డి రెండు పార్టీల తరపున హోరాహోరీగా తలపడేవారు. అయితే.. మొన్నటి ఎన్నికల్లో ఇద్దరూ కలిసిపోయారు. అయినప్పటికీ… ఇద్దరికీ చేదు అనుభవమే ఎదురయింది. అది కూడా… ఇద్దరూ కలిసినా వైసీపీకి యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీ వచ్చింది. అలా ఎలా వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు. ఈ క్రమంలో.. వైసీపీ ప్రభుత్వం నుంచి… ఆదినారాయణరెడ్డికి సెగ ప్రారంభమయిందని చెబుతున్నారు. అనుచరులపై దాడులు.. ఇతర కేసుల వ్యవహారంలో.. అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతూండటంతో.. రక్షణ కోసమైనా.. బీజేపీ వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

భారతీయ జనతా పార్టీ కూడా.. రాయలసీమపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైసీపీని ఎదుర్కోవాలంటే… రక్షణ కావాల్సిందేనని.. ఆ రక్షణ తామిస్తామని.. టీడీపీ నేతలకు అభయమిస్తారు. ఇప్పటికే ధర్మవరం టీడీపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బీజేపీ గూటికి చేరి.. ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు.. ఆదినారాయణ రెడ్డి కూడా.. అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ మార్క్ రాజకీయాలను ఎదుర్కోవాలంటే.. కనీసం.. ఏదో ఓ అధికారపారటీ అండ ఉండాలన్న ఉద్దేశంతో.. బీజేపీ వైపే నేతలు మొగ్గుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close