అడ‌వి శేష్‌కి మోకాళ్ల‌డ్డుతున్న ‘టూ స్టేట్స్‌’

బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ట‌యిన `టూ స్టేట్స్‌`ని తెలుగులో రీమేక్ చేసి, ఆ సినిమాని మ‌ధ్య‌లో ఆపేసిన సంగ‌తి తెలిసిందే. అడ‌విశేష్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమాని మొద‌లెట్టారు. రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని క‌థానాయిక‌. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది. అప్ప‌టికి దాదాపు 90 శాతం షూటింగ్ కూడా అయిపోయింది. ఈ సినిమాని ఎలాగైనా స‌రే, పూర్తి చేసి విడుద‌ల చేయాల‌న్న‌ది నిర్మాత ఎం.ఎల్‌.వి స‌త్య‌నారాయ‌ణ ప్లాన్‌.

అడ‌విశేష్ మ‌రో 20 రోజులు కాల్షీట్లు ఇస్తే.. ఈ సినిమా అయిపోతుంది. అయితే శేష్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ప‌రిస్థితుల్లో `టూ స్టేట్స్‌` కాల్సీట్లు ఇవ్వ‌డం క‌ష్ట‌మే. శేష్‌కి కూడా ఈ రీమేక్ పై న‌మ్మ‌కం లేదు. `సినిమాని ఆపేద్దాం. నా పారితోషికం తిరిగి ఇచ్చేస్తా. కావాలంటే మ‌రో సినిమా చేస్తా` అని నిర్మాత‌కు మాట ఇచ్చాడ‌ని తెలుస్తోంది. కానీ… ఇప్ప‌టి వ‌ర‌కూ పారితోషికం వెన‌క్కి ఇవ్వ‌లేదు. మ‌రో సినిమా ఒప్పుకోలేదు. `టూ స్టేట్స్‌` ప‌క్క‌న పెట్టి, మిగిలిన సినిమాలు ఒకే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ విష‌య‌మై నిర్మాత‌… అడ‌విశేష్‌పై కోర్టుకెక్కిన‌ట్టు తెలుస్తోంది. కోర్టు కూడా `ముందు టూ స్టేట్స్ విష‌యాన్ని సెటిల్ చేసుకోండి` అని అడ‌విశేష్ త‌ర‌పున న్యాయ వాదికి సూచించార్ట‌. శేష్ మ‌రో సినిమా ఒప్పుకోవాల‌న్నా, విడుద‌ల అవ్వాల‌న్నా.. `టూ స్టేట్స్` నిర్మాత నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాలి. మ‌రి.. ఈ విష‌యాన్ని శేష్ ఎప్పుడు సెటిల్ చేసుకుంటాడో, ఏమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close