తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి ‘గుడ్ – బ్యాడ్ – అగ్లీ’ అనే పేరు పెట్టారు. ఇందులో ముగ్గురు హీరోయిన్ల‌ని తెలుస్తోంది. ఓ క‌థానాయిక‌గా శ్రీ‌లీల ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంది. మ‌రో ఇద్ద‌రు వెట‌రన్ భామ‌లు క‌నిపించ‌నున్నారు. ఓ పాత్ర‌లో మీనా, మ‌రో పాత్ర‌లో సిమ్రాన్ న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా హీరో పాత్ర మూడు విభిన్న‌మైన కోణాల్లో, గెట‌ప్పుల్లో క‌నిపించ‌బోతున్న‌ట్టు టాక్‌. తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ఇలా మూడు త‌రాల్నీ… అజిత్ చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. అందుకోసం లుక్ టెస్ట్ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు క‌థానాయిక‌లు, ఇత‌ర న‌టీన‌టుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

తాత పాత్ర ప‌క్క‌న సిమ్రాన్‌, తండ్రి పాత్ర కోసం మీనా మ‌న‌వ‌డి కోసం శ్రీ‌లీల‌ని ఎంచుకొన్నార‌ని స‌మాచారం. అజిత్ తో శ్రీ‌లీల‌కు ఇదే తొలి సినిమా. అయితే సిమ్రాన్ ఇది వ‌ర‌కే.. ‘వాలి’ చిత్రం కోసం అజిత్ తో జోడీ క‌ట్టింది. అంత‌కు ముందు ‘అవ‌ల్ వ‌రువాలా’లో ఇద్ద‌రూ క‌లిసి న‌టించారు. ఇది మూడో సినిమా అవుతుంది. మీనా కూడా గ‌తంలో రెండు చిత్రాల్లో అజిత్ స‌ర‌స‌న న‌టించింది. ఇది మీనా, సిమ్రాన్ ల‌కు అజిత్ తో హ్యాట్రిక్ సినిమా. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తారు. అప్పుడే పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close