నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న ‘యావ‌రేజ్’ హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు. వీళ్ల మ‌ధ్య నాగ‌శౌర్య ప‌రిస్థితి కాస్త విచిత్రంగా తోస్తోంది. ల‌వ్ స్టోరీల‌కూ, ఫ్యామిలీ డ్రామాల‌కూ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ చిత్రాల‌కూ బాగా స‌రిపోయే యూత్ ఫుల్ హీరో నాగ‌శౌర్య‌. త‌న‌కు ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’, ‘చ‌లో’ లాంటి హిట్స్ ఉన్నాయి. యేడాదికి రెండు మూడు సినిమాలు చేసేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ఫుల్ ఖాళీ.

‘రంగ‌బ‌లి’ త‌ర‌వాత శౌర్య మ‌రో క‌థ ఒప్పుకోలేదు. ఆ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు శౌర్య‌. కానీ ఫ‌లితం రాలేదు. దాంతో కాస్త నిరుత్సాహానికి లోనైన‌ట్టు తెలుస్తోంది. శౌర్య ద‌గ్గ‌ర‌కు క‌థ‌లు చాలానే వెళ్తున్నాయి. నిర్మాత‌లూ ఉన్నారు. కానీ ఎలాంటి క‌థ‌ల్ని ఎంపిక చేసుకోవాలో తెలీని సందిగ్థంలో నాగ‌శౌర్య ఉన్న‌ట్టు టాక్‌. గ‌తేడాదే శౌర్య పెళ్ల‌య్యింది. అందుకే ఫ్యామిలీకీ కాస్త టైమ్ కేటాయిస్తున్నాడ‌ట‌. సినిమాల విష‌యంలో తొంద‌ర ప‌డ‌డం లేద‌ని, గ‌న్ షాట్ గా హిట్ కొట్టే క‌థ కోసం ఎదురు చూస్తున్నాడ‌ని శౌర్య స‌న్నిహితులు చెబుతున్నారు. చేతిలో సొంత నిర్మాణ సంస్థ ఉండ‌నే ఉంది. మంచి క‌థ దొరికితే నిర్మాత‌ని కూడా వెదుక్కోవాల్సిన ప‌నిలేదు. అదే.. శౌర్య ధీమా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎర్రబెల్లి సైలెన్స్ ఎందుకబ్బా..!!

బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కు అత్యంత సన్నితుడిగా పేరొందిన ఎర్రబెల్లి దయాకర్ ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆ మధ్య ఆయన కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా...

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close