మళ్ళీ తెరపైకి సెక్షన్ 8: గవర్నర్ జోక్యం చేసుకోవాలన్న అఖిలపక్షం

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నేతలు లేవనెత్తిన సెక్షన్ 8 అంశం, నిన్న మజ్లిస్ నేతల దౌర్జన్యం నేపథ్యంలో మళ్ళీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల అదుపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమయిందని చెప్పటానికి గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నిన్న జరిగిన సంఘటనలే నిదర్శనమంటూ అఖిలపక్షనేతలు ఇవాళ సెక్షన్ అమలుకు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సీఎల్‌పీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్వర్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ, టీడీపీ, వైసీపీ నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, లక్ష్మణ్, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, ఎల్. రమణ, శివకుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు. అసదుద్దీన్‌పై, దాడులకు పాల్పడిన ఆయన పార్టీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సీ ఎస్‌టీ అట్రాసిటీ చట్టంకింద కేసులు నమోదు చేయాలని అన్నారు. గవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని, సెక్షన్ 8 అమలుకు ఆదేశించాలని కోరారు. గతంలో తాము సెక్షన్ 8 అమలును వ్యతిరేకించినప్పటికీ మజ్లిస పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మూడు డివిజన్‌లలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడి, హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను త్వరలో కలిసిల రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. మరోవైపు నిన్న ఉత్తమ్, షబ్బీర్‌లపై దాడులకు సంబంధించి హబీబ్, కశ్యబ్, ఇస్మాయిల్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close