పవన్ పర్యటనకు అమరావతి రైతుల ఏర్పాట్లు..!

గతంలో భూములు ఇవ్వని రైతులకు మద్దతుగా అమరావతి పర్యటన చేసిన పవన్ కల్యాణ్ గురువారం… భూములు ఇచ్చిన రైతులకు అండగా పర్యటించబోతున్నారు. మూడ్రోజుల క్రితం హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజధాని రైతులు కలిశారు. వారికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. గురువారం అమరావతి వెళ్లబోతున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి రాజధాని పర్యటన ప్రారంభిస్తారు. ముందుగా అభివృద్ధి పనులు పరిశీలిస్తారు. సీడ్ యాక్సెస్ రహదారి మీదుగా సీఆర్డీఏ భవనాలు చూసుకుంటూ ఉండవల్లిలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుంది. ఏర్పాట్లన్నీ రైతులే చేస్తున్నారు.

రాజధానిలో గతంలో భూ సమీకరణ సందర్భంగా యర్రబాలెం, ఉండవల్లి, తాడేపల్లి, పెనుమాక గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధాని కోసం భూములివ్వని రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు సేకరించొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులు తమ గోడును వెళ్లబోసుకోవడంతో పవన్ కళ్యాణ్ స్వయంగా వారి స్థితిగతులను పరిశీలించటంతోపాటు రాజధానిలో జరిగిన నిర్మాణాలను కూడా దగ్గరుండి పరిశీలించాలని నిర్ణయించారు. పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ రాజధానిపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.

పవన్ కల్యాణ్ పై ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీ విమర్శలు ప్రారంభించింది. పవన్ గతంలో ఏమన్నారో.. ఇప్పుడేమంటున్నారో అందరికీ గుర్తేనని.. మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్… కొద్ది రోజుల కిందటే… రాజధానికి పూర్తి మద్దతు ప్రకటించారు. రాజధాని నిర్మాణాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తీరుపై.. ఘాటుగా స్పందించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close