అభిమానులను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు: అల్లు అర్జున్

మలయాళ చిత్రం ‘ఒరు అడార్‌ లవ్’కి తెలుగు అనువాదం ‘లవర్స్ డే’ ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రావడానికి కారణం ప్రియా ప్రకాష్ వారియర్ అనుకున్నారంతా. గతంలో అల్లు అర్జున్ సరసన నటించే ప్రియా ప్రకాష్ వారియర్ కి వెళ్లడంతో ఈ ఊహాగానాలు వచ్చాయి. అయితే అల్లు అర్జున్ హాజరుకు అసలు కారణం ప్రియా ప్రకాష్ వారియర్. ‘లవర్స్ డే’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాతల్లో ఒకరైన సి.హెచ్. వినోద్ రెడ్డి.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని కొన్ని ఏరియాల్లో వినోద్ రెడ్డి పంపిణీ చేశారు. నష్టాలు వచ్చినా వినోద్ రెడ్డి గొడవలు చేయలేదని అతడి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తనకు శక్తి ఉంటే అభిమానుల కోసం ఏదో ఒకటి చేయడానికి సిద్ధమని అల్లు అర్జున్ అన్నారు.

‘లవర్స్ డే’ ఆడియోలో అర్జున్ మాట్లాడుతూ “ఇక్కడికి నేను రావడానికి రెండు కారణాలు వున్నాయి. మలయాళ ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. మలయాళ పరిశ్రమ నుంచి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం మన తెలుగుకు వస్తున్నప్పుడు ఆ సినిమాను ప్రోత్సహించడం నా బాధ్యత అనుకున్నా. ఇదో కారణం అయితే వినోద్ రెడ్డి ముఖ్య కారణం. ‘నా పేరు సూర్య’ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు వినోద్ రెడ్డిని బన్నీ వాసు నాకు పరిచయం చేశాడు. ‘మీ అభిమాని’ అని చెప్పాడు. మన సినిమా కొన్నాడు కాబట్టి ఇలా చెబుతున్నావా? అని అడిగా. ‘లేదండి. నిజంగా మీ అభిమాని’ అన్నాడు. సినిమా విడుదల తరవాత సరిగా ఆడకపోవడం వలన గొడవలు జరిగాయి. అప్పుడు బన్నీ వాసు ‘వినోద్ రెడ్డి అసలు గొడవ చేయడం లేదు’ అని చెప్పాడు. అప్పుడు వినోద్ రెడ్డికి ఏదో ఒకటి చేయాలనుకున్నా. ఎందుకంటే నా అభిమానులను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. అభిమానులను పోగొట్టుకోవడం నాకిష్టం లేదు” అని అన్నారు.

ల‌వ‌ర్స్ డే’ ఆడియోలో అల్లు అర్జున్ సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. అల్లు అర్జున్‌కి గురి పెడుతూ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కిస్సింగ్ గ‌న్ షాట్ కొట్ట‌డం ఒక హైలైట్ అయితే… తన స్పీచ్ పూర్తి చేశాక ప్రేక్ష‌కుల‌కు గురి పెడుతూ అల్లు అర్జున్ ఇచ్చిన గ‌న్ షాట్ మ‌రో హైలైట్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close