వైసీపీ మిత్రోం సీపీఎం కూడా అమరావతికే జై..! 

కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటైన సీపీఎం రాజధాని అమరావతి విషయంలో స్పష్టమైన అభిప్రాయాన్ని హైకోర్టుకు చెప్పింది. ఇంత కాలం సీపీఎం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఏపీలో మరే ప్రతిపక్ష పార్టీ కూడా లేనంత సన్నిహితంగా అధికార పార్టీతో అంటకాగుతోంది. వైసీపీ సర్కార్ చల్లని చూపు ఉంటే చాలన్నట్లుగా నొప్పింపక.. తానొవ్వక అన్నట్లుగా రాజకీయాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో హైకోర్టులో … సీపీఎం వేసిన అఫిడవిట్.. ఆ పార్టీ కాస్త తెగించిందనే అభిప్రాయానికి వచ్చేలా చేస్తోంది. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు.. ముందుగా రాజధాని అంశంలో కేంద్రాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు కానీ.. ఏపీ సర్కార్ పై మాత్రం సుతిమెత్తగా ఆరోపణలు చేశారు. 

రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని..  రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసంకాదని సీపీఎం మధు తన అఫిడవిట్‌లో తెలిపారు.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను నిర్ణయించింది కేంద్రమే.. ఇప్పుడు ఏపీ రాజధానితో కేంద్రానికి సంబంధం లేదంటే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.  రాజధాని నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల నిధులు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు.   రాజధానిలో వేల కోట్లను ఖర్చు చేసిన తర్వాత.. రాజధాని తరలింపు సరికాదని..  రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల భవిష్యత్ ఏమిటని మధు ప్రశ్నిస్తున్నారు. 

 రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించింది.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ సాక్షాత్తు..అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని గుర్తు చేసింది. బయట పోరాడినా పోరాడకపోయినా.. మద్దతిచ్చినా.. ఇవ్వకపోయినా.. ఒక్క వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close